Wipro News: రూ.500 కోట్లు విలువైన షేర్లను గిఫ్డ్ ఇచ్చిన విప్రో వ్యవస్థాపకుడు..!

Azim Premji: విప్రో పేరు మనందరికీ పరిచయం అవసరం లేనిది. ప్రస్తుతం దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న సంస్థ ఇతర వ్యాపారాలను సైతం కొనసాగిస్తోంది.

ఐటీ కంపెనీని స్థాపించిన వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 23, 2024న ఆయన కంపెనీలో రూ.500 కోట్లు విలువైన షేర్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది కంపెనీ మెుత్తం ఈక్విటీ షేర్లలో దాదాపు 0.2 శాతం మాత్రమే. వీటిని తన ఇద్దరు కుమారులైన రిషద్, తారిఖ్ లకు అందిస్తున్నట్లు స్టాక్ మార్కెట్లకు వెల్లడించటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Azim Premji Wipro founder gifts 500 crore worth equity shares to sons Rishad, Tariq

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రేమ్‌జీ తన ఇద్దరు కుమారులకు ఒక్కొక్కరికి 51 లక్షల విప్రో ఈక్విటీ షేర్లను తాజా గిఫ్ట్ రూపంలో అందించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం కుమారులు రిషద్ ప్రేమ్‌జీ విప్రో ఛైర్మన్‌గా కొనసాగుతుండగా.. విప్రో ఎంటర్‌ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తారిఖ్ ప్రేమ్‌జీ ఉన్నారు. తాజా బదిలీ తర్వాత అజీమ్ ప్రేమ్‌జీకి కంపెనీలో 4.3 శాతం, రిషద్ అండ్ తారిఖ్‌లకు 0.03 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.

గతవారం విప్రో కంపెనీ తన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెలువరించింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న వ్యాపార మందగమనం నేపథ్యంలో కంపెనీ మార్కెట్లు ఊహించిన అంచనాలను అందుకోలేకపోతోంది. ఈ క్రమంలో నేడు ఉదయం 10.52 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ.473.80 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+