Stock Tips: ప్రస్తుతం దేశంలోని ఈక్విటీ మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని షేర్లపై ఇటు ఇన్వెస్టర్లు అటు బ్రోకరేజీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది Pitti Engineering Ltd కంపెనీ షేర్ల గురించే. గడచిన మూడేళ్ల కాలంలో ఈ షేరు 2000 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఇది కంపెనీ పెరుగుతున్న సామర్థ్యం, గ్లోబల్ ఫుట్ప్రింట్తో పాటు బలమైన ఆర్డర్ బుక్పై బలమైన బుల్లిష్నెస్ను ప్రతిబింబిస్తుంది. ఈ కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ BUY రేటింగ్ అందించింది. ఇందుకోసం కంపెనీ షేర్లకు రూ.915 ధరను టార్గెట్ రేటుగా నిర్ణయించింది.

వాస్తవానికి శుక్రవారం స్టాక్ ముగింపు ధర రూ.658.95గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ అంచనా ధర ప్రస్తుత మార్కెట్ ధర కంటే దాదాపు 40 శాతం అధికం. గత ట్రేడింగ్ సెషన్లో PEL షేర్లు బీఎస్ఈలో 1.21 శాతం పెరిగి రూ.658.95 వద్ద ముగిసింది. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,111.94 కోట్లుగా ఉంది. కంపెనీని FY26 ఆదాయాలపై 19x విలువతో షేరుకు రూ.915 టార్గెట్ ధరను ఇస్తున్నట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ తెలిపింది.
FY26 నాటికి కంపెనీ ఆదాయం 13 శాతం వార్షిక వృద్ధి రేటు(CAGR)తో రూ.1,588 కోట్లకు పెరుగుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. కంపెనీకి హైదరాబాదులో రెండు అతిపెద్ద తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రధానంగా వీటి నుంచి తయారయ్యే మెుత్తాన్ని ఎగుమతులకు వినియోగిస్తారు. అలాగే ఔరంగాబాదులో కంపెనీకి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ తయారీ కేంద్రం కూడా ఒకటి ఉంది. భారీ యంత్రాలతో పాటు వివిధ విడిభాగాలను సైతం కంపెనీ తయారు చేస్తోంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి అధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పూర్తిగా నష్టాలకు కూడుకున్నవి. ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకునే ముందు తప్పక మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications