air taxi: త్వరలో చవక ఎయిర్ ట్యాక్సీ సేవలు.. దుబాయ్ కంటే ముందుగా ఇండియాలో చక్కర్లు
air taxi: అతి త్వరలోనే భారతీయ గగనతలంలో ఎయిర్ ట్యాక్సీలు వీరవిహారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తు విమానయాన కార్యదర్శే ఈ విషయాన్ని స్పష్టం చేయడం విశేషం. రోడ్డుపై ప్రయాణించే ఓలా, ఉబర్ ట్యాక్సీల గురించి తెలుసు కానీ ఈ ఎయిర్ ట్యాక్సీల మాటేమిటి అంటారా ? అయితే ఈ వివరాలు చూడండి మరి.
2021 నుంచి చండీగఢ్లో ఎయిర్ ట్యాక్సీలను ప్రజలు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విమానాల కోసం రన్వేలు, చాలా స్థలంతో పాటు ఇంధనం
పెద్దమొత్తంలో అవసరం. ఈ తరహా హెలికాప్టర్ సేవలకు దేశం కొత్తకాకపోయినా.. కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ సిస్టమ్ల తయారీతో, సరసమైన ఎయిర్ క్యాబ్లు 2025 నాటికి భారతీయ నగరాల్లో చక్కర్లు కొట్టనున్నాయి.

అధునాతన మరియు స్వల్ప-దూర వైమానిక మొబిలిటీ గురించి పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ మాట్లాడారు. eVTOL వాహనాలు ప్రభుత్వ మిషన్ ఉడాన్తో ఎలా జత కలుస్తాయో హైలైట్ చేశారు. వర్టికల్ ఎలక్ట్రిక్ టేకాఫ్ వాహనాలు గేమ్ ఛేంజర్గా నిలవనున్నట్లు చెప్పారు. అపెక్స్ ఇండస్ట్రీ ఛాంబర్ బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. దుబాయ్లో 2026లో ప్రారంభానికి షెడ్యూల్ చేసిన ఏడాదికి ముందే భారతదేశం eVTOL మద్ధతు కలిగిన ఎయిర్ టాక్సీలను వినియోగిస్తుందని అభిప్రాయపడ్డారు.
వర్టికల్ టేకాఫ్కు రన్వే అవసరం వంటి పరిమితులు ఉండవు. నిలువుగా టేకాఫ్ కాగలవు. కాబట్టి ప్రయాణీకుడు ప్రతిదీ నియంత్రించగలుగుతాడు. తేలికైన, మరింత కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్.. ఎలక్ట్రిక్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ మెకానిజమ్ల ద్వారా శక్తిని పొందుతుంది. తద్వారా విమాన ఇంధనంపై ఆధారపడటం తగ్గుతుంది. డ్రైవర్ కలిగిన మరియు సెల్ఫ్ డ్రైవింగ్ ఎయిర్ క్యాబ్ల నిర్వహణ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మరియు రక్షణ మంత్రిత్వ శాఖలతో చర్చించాల్సిన ఆవశ్యకతను బన్సాల్ నొక్కిచెప్పారు.


Click it and Unblock the Notifications