Tax News: చాలా కాలంగా దేశీయ విమానయాన రంగం భారీ ఒడిదొడుకులతో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా కంపెనీలు మూతపడిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల కిందట నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రభుత్వం చివరికి దాని పాత ఓనర్ టాటాలకు తిరిగి విక్రయించిన సంగతి తెలిసిందే.
విమానయాన పరిశ్రమలకు సంబంధించి పెద్ద శుభవార్త ఒకటి ఉంది. ఇకపై అన్ని విమానాల విడిభాగాలపై 5 శాతం ఐజీఎస్టీ విధిస్తూ భారత ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది. భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితిలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం MRO(మెయింటెనెన్స్, రిపేర్స్ ఓవర్హాల్) పరిశ్రమకు పెద్ద శుభవార్త కంటే తక్కువ కాదు. తాజా రూల్స్ రేపటి నుంచి అంటే జూలై 15, 2024 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.

దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, ఇండిగో పెద్ద సంఖ్యలో విమానాల ఆర్డర్లు ఇచ్చాయి. రానున్న 10 ఏళ్లలో 1200 జెట్లను డెలివరీ చేయవచ్చని అంచనా. ఇటువంటి పరిస్థితిలో MRO కంపెనీలు రాబోయే సంవత్సరాల్లో పెద్ద ఉద్యోగాన్ని పొందబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈ కంపెనీలకు చాలా లాభదాయకంగా నిలవనుంది.
దేశంలోని ప్రముఖ MRO కంపెనీల గురించి పరిశీలిస్తే.. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, మాక్స్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్, GMR ఏరో టెక్నిక్ లిమిటెడ్, రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ బస్ ఇండియా, బోయింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా పన్ను నిర్ణయంతో నేరుగా లాభపడనున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 7000 మంది ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు ఉన్నారు. అయితే ఏవియేషన్ రంగం వృద్ధి చెందుతున్న వేగాన్ని బట్టి దాదాపు 14,000 మంది ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ల అవసరం ఏర్పడనుంది. వీటికి సంబంధించిన కోర్సులకు సైతం భారీగా డిమాండ్ పెరుగుతున్నాట్లు సమాచారం.


Click it and Unblock the Notifications