కరోనా మహమ్మారి కారణంగా ఈసారి వివిధ రంగాల్లోని అన్ని కంపెనీలు శాలరీ కోత, ఉద్యోగాల కోత విధించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పెనుప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులకు శాలరీని పెంచాయి. సగటున శాలరీ ఇంక్రిమెంట్ గత ఏడాది 8.6 శాతంగా ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతానికి క్షీణిస్తుందని ఓ సర్వే అంచనా వేసింది. ప్రముఖ కన్సల్టెన్సీ డెలాయిట్ టచ్ తోహమత్సు ఇండియా ఎల్ఎల్పీ కరోనా మహమ్మారి ప్రభావం, వేతనాలపై సర్వే నిర్వహించింది.

అందుకే వారికి వేతనం భారీగా పెరిగింది
కరోనా మహమ్మారి ప్రభావం మార్చి చివరి నెల నుండి ప్రారంభమైంది. దీంతో అంతకుముందే వేతనాలు పెంచిన సంస్థలకు చెందిన ఉద్యోగులకు మంచి శాలరీ ఇంక్రిమెంట్ లభించింది. లాక్ డౌన్కు ముందే పెంచడంతో వేతన పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది. అయితే ఆ తర్వాత చాలా కంపెనీలు వేతనాలు పెంచలేదు. 20 శాతానికి పైగా ఆదాయం తగ్గుతుందని భావిస్తున్న కంపెనీలు అతి తక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చినట్లు సోమవారం నాటి సర్వే వివరాల్లో తెలిపింది.

ఇంక్రిమెంట్లు ఇవ్వకూడదని నిర్ణయం
2020 వర్క్ ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ పేరుతో చేసిన ఈ సర్వేలో 350కి పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఈ సర్వే ప్రకారం దేశంలోని ప్రతి 10 కంపెనీల్లో కేవలం 4 మాత్రమే ఈసారి ఇంక్రిమెంట్స్ ఇచ్చాయి. 33 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ ఇవ్వకూడదని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో సగటు వేతన పెంపు 3.6 శాతంగా ఉంది. దశాబ్ద కాలంలో ఇదే అత్యల్పం. 2019లో ఇది 8.6 శాతంగా ఉంది.

వేతనాలు ఇచ్చిన సంస్థలు తీసుకున్నా..
ఇంక్రిమెంట్స్ ఇచ్చిన సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 2020లో సగటు ఇంక్రిమెంట్ 7.5 శాతంగా ఉంది. 10 శాతం కంటే తక్కువ కంపెనీలు 10 శాతం కంటే ఎక్కువ వేతన పెంపును అమలు చేశాయి. మార్చి 2020 నుండి వేతనాలు పెంచే సంస్థలు భారీగా పడిపోయాయి.
కరోనా కారణంగా మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల పాటు ఇది కొనసాగడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. జూన్ రెండో వారం నుండి ఆంక్షలు ఎత్తివేశారు. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న వివిధ నగరాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా, తదనంతర లాక్ డౌన్ పరిణామాలు ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications