కరోనా మహమ్మారి కారణంగా ఈసారి వివిధ రంగాల్లోని అన్ని కంపెనీలు శాలరీ కోత, ఉద్యోగాల కోత విధించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పెనుప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులకు శాలరీని పెంచాయి. సగటున శాలరీ ఇంక్రిమెంట్ గత ఏడాది 8.6 శాతంగా ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతానికి క్షీణిస్తుందని ఓ సర్వే అంచనా వేసింది. ప్రముఖ కన్సల్టెన్సీ డెలాయిట్ టచ్ తోహమత్సు ఇండియా ఎల్ఎల్పీ కరోనా మహమ్మారి ప్రభావం, వేతనాలపై సర్వే నిర్వహించింది.

అందుకే వారికి వేతనం భారీగా పెరిగింది
కరోనా మహమ్మారి ప్రభావం మార్చి చివరి నెల నుండి ప్రారంభమైంది. దీంతో అంతకుముందే వేతనాలు పెంచిన సంస్థలకు చెందిన ఉద్యోగులకు మంచి శాలరీ ఇంక్రిమెంట్ లభించింది. లాక్ డౌన్కు ముందే పెంచడంతో వేతన పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది. అయితే ఆ తర్వాత చాలా కంపెనీలు వేతనాలు పెంచలేదు. 20 శాతానికి పైగా ఆదాయం తగ్గుతుందని భావిస్తున్న కంపెనీలు అతి తక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చినట్లు సోమవారం నాటి సర్వే వివరాల్లో తెలిపింది.

ఇంక్రిమెంట్లు ఇవ్వకూడదని నిర్ణయం
2020 వర్క్ ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ పేరుతో చేసిన ఈ సర్వేలో 350కి పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఈ సర్వే ప్రకారం దేశంలోని ప్రతి 10 కంపెనీల్లో కేవలం 4 మాత్రమే ఈసారి ఇంక్రిమెంట్స్ ఇచ్చాయి. 33 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ ఇవ్వకూడదని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో సగటు వేతన పెంపు 3.6 శాతంగా ఉంది. దశాబ్ద కాలంలో ఇదే అత్యల్పం. 2019లో ఇది 8.6 శాతంగా ఉంది.

వేతనాలు ఇచ్చిన సంస్థలు తీసుకున్నా..
ఇంక్రిమెంట్స్ ఇచ్చిన సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 2020లో సగటు ఇంక్రిమెంట్ 7.5 శాతంగా ఉంది. 10 శాతం కంటే తక్కువ కంపెనీలు 10 శాతం కంటే ఎక్కువ వేతన పెంపును అమలు చేశాయి. మార్చి 2020 నుండి వేతనాలు పెంచే సంస్థలు భారీగా పడిపోయాయి.
కరోనా కారణంగా మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల పాటు ఇది కొనసాగడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. జూన్ రెండో వారం నుండి ఆంక్షలు ఎత్తివేశారు. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న వివిధ నగరాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా, తదనంతర లాక్ డౌన్ పరిణామాలు ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications