Forbes: ఫోర్బ్స్ గ్లోబల్ మీడియా హోల్డింగ్స్ చేతులు మారబోతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. 28 ఏళ్ల ఆటోమోటివ్ టెక్ బిలియనీర్ ఆస్టిన్ రస్సెల్ హస్తగతం చేసుకోనుందని వెల్లడించాయి. ప్రస్తుత యజమాని హాంకాంగ్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ వేల్ మీడియా ఇన్వెస్ట్ మెంట్స్(IWM) నుంచి ఫోర్బ్స్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపాయి.
లుమినార్ టెక్నాలజీస్ CEO ఆస్టిన్ రస్సెల్. ఇది ఆటో పరిశ్రమకు స్వయంప్రతిపత్త డ్రైవింగ్ సాంకేతికతను అందించే టెక్ కంపెనీ. 2.1 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది. ఫోర్బ్స్ కు చెందిన మిగిలిన షేర్లతో సహా అందులో 82 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారం కుదిరినట్లు రస్సెల్ మరియు IWM ప్రకటించారని నివేదికలు వెలువడ్డాయి.

IWM మైనారిటీ వాటాను తనవద్ద ఉంచుకోనుంది. బిజినెస్ అవుట్ లెట్ ఛైర్మన్ మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ కంపెనీతో కొనసాగాలని యోచిస్తున్నట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. కాగా ఈ డీల్ విలువ దాదాపు 800 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ లావాదేవీ ద్వారా నిజమైన ఆవిష్కర్త, దూరదృష్టి గల రస్సెల్ కొత్త స్టీవార్డ్ గా ఉండటం సరైనదని ఫోర్బ్స్ CEO మైక్ ఫెడెర్లే వ్యాఖ్యానించారు.

ఫోర్బ్స్ వార్తా కవరేజీ మరియు రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనడానికి రస్సెల్ ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. దాని వృద్ధిని మరింత పెంచడంతో పాటు దాతృత్వ ప్రయోజనాలను కొనసాగించడంపై దృష్టి సారిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఫోర్బ్స్ కోసం టెక్నాలజీ, మీడియా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులతో కూడిన కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications