ఆటోమేటిక్ చెల్లింపులపై భారీ ఊరట, సెప్టెంబర్ 30 వరకు గడువు

రీచార్జీలు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలీటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై వినియోగదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రవీకరణ (AFA) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది. ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులకు కస్టమర్ల నుండి అదనపు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మార్చి 31వ తేదీ తర్వాత AFAకు లోబడకుండా కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తోన్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్ఆర్‌బీలు, ఎన్బీఎప్‌సీలు, పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తోన్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్ఆర్బీలు, ఎన్బీఎఫ్‌సీలు, పేమెంట్ గేట్‌వేలతో పాటు బ్యాంకులను ఆర్బీఐ గత ఏడాది డిసెంబర్ 4న ఆదేశించింది. కార్డు ట్రాన్సాక్షన్స్ భద్రత, రక్షణ బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

Auto debit facilities to stay, New RBI rule postponed till september 30

కొత్త నిబంధన ప్రకారం రికరింగ్ ఆటోమేటిక్ చెల్లింపుల మొత్తం రూ.5వేలు దాటితే బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు, పేమెంట్ గేట్‌వేల చెల్లింపుదారులకు OTP ద్వారా వారి ఆమోదం తీసుకున్న తర్వాతే ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలి. లేదా ఆ చెల్లింపులను అనుమతించరు. అంతకుముందు రూ.2000కు మించి ట్రాన్సాక్షన్‌కు పరిమితం చేయాలని భావించినప్పటికీ, పలు విజ్ఞప్తుల నేపథ్యంలో రూ.5వేలకు పెంచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+