Spices Crisis: భారతీయ కంపెనీలు MDH, ఎవరెస్ట్ విక్రయిస్తున్న మసాలా మిశ్రమాల్లోని కలుషితంపై ఆస్ట్రేలియా ఆహార భద్రతా ఏజెన్సీ తన పరిశోధనను తీవ్రతరం చేస్తోంది. ఈ చర్యలతో ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటర్ల నుంచి భారతీయ కంపెనీల ఉత్పత్తులపై అధిక పరిశీలనకు అద్దం పడుతోంది.
ఇటీవల హాంకాంగ్ ఆహార భద్రత ఏజెన్సీలు భారతీయ మసాలా ఉత్పత్తిదారులైన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా మిక్స్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మసాలా మిక్స్లలో అధిక స్థాయి ఇథిలీన్ ఆక్సైడ్ క్యాన్సర్కు కారణమని మానవ వినియోగానికి పనికిరాదు. హాంకాంగ్ నుంచి వచ్చిన హెచ్చరికపై స్పందించిన సింగపూర్ ఎవరెస్ట్ మసాలా మిశ్రమాన్ని రీకాల్ చేయాలని ఆదేశించింది. దీంతో ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సైతం తాజాగా రంగంలోకి దిగాయి. ఆస్ట్రేలియన్ వినియోగదారులపై పరిస్థితి, తీవ్రత, సంభావ్య ప్రభావాలను అంచనా వేసేందుకు స్థానిక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సహకరిస్తున్నట్లు వెల్లడైంది.

ఆస్ట్రేలియాలో విక్రయించే ఆహారాలలో ఇథిలీన్ ఆక్సైడ్ అనుమతించబడదని ఏజెన్సీ నొక్కి చెప్పింది. ఇది సాధ్యమయ్యే రీకాల్ను సూచిస్తుంది. ఎవరెస్ట్ ప్రతినిధి ఒకరు సింగపూర్ మరియు హాంకాంగ్లలో తమ ఉత్పత్తులపై నిషేధాన్ని సూచిస్తున్న ఇటీవలి నివేదికలు తప్పు అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎవరెస్ట్ ఇటీవల గుడ్రిటర్న్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిశీలన ఆస్ట్రేలియా దాటి విస్తరించింది, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ విషయంపై సమాచారాన్ని సేకరిస్తుంది. భారత అధికారులు MDH, ఎవరెస్ట్ ప్లాంట్లను పరిశీలించారు.
ఈ కంపెనీలను పరిశీలించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో సాల్మొనెల్లా కాలుష్యం కారణంగా యునైటెడ్ స్టేట్స్లో కొన్ని MDH వస్తువులు రీకాల్ చేయబడ్డాయి. 2023లో FDA అదే కారణంతో రెండు ఎవరెస్ట్ మసాలా మిశ్రమాలను రీకాల్ చేయాలని ఆదేశించింది. భారతదేశం ఇటీవల MDH మరియు ఎవరెస్ట్ ఎగుమతులపై డేటాను హాంకాంగ్, సింగపూర్లోని అధికారుల నుండి కోరింది. సమస్యను పరిష్కరించడానికి వేగంగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే హాంగ్ కాంగ్ ఫుడ్ సేఫ్టీ సెంటర్, పరీక్ష ఫలితాల గురించి భారత రాయబార కార్యాలయానికి తెలియజేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications