ఏటీఎం సర్వీస్ ఛార్జీలు పెరిగాయి, ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ.21కి పెంపు

ఆంగ్ల కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. కొత్త నెల లేదా కొత్త సంవత్సరంలో కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ సెక్టార్‌కు సంబంధించిన కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ఒకటి- ఏటీఎం నగదు విత్ డ్రా ఛార్జీల పెరుగుదల. ఉచిత పరిమితిని దాటి ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే ప్రతి నగదు లావాదేవీలపైనా వసూలు చేసే సర్వీసు ఛార్జీలను బ్యాంకులు పెంచాయి. జనవరి 1వ తేదీ నుండి ఇవి అమల్లోకి వచ్చాయి.

ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలను పెంచాలని కోరుతూ బ్యాంకులు దాఖలు చేసిన ప్రతిపాదనలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే కస్టమర్ల నుంచి ఇప్పటిదాకా వసూలు చేసే సర్వీసు ఛార్జీలను బ్యాంకులు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. అధిక ఛార్జీలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతిచ్చింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమలు అవుతుందని ఇదివరకే పేర్కొంది. అన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు దీన్ని వర్తింపజేసింది.

 ATM service charges increase, to cost Rs 21 per transaction from Saturday

రిజర్వుబ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా.. 2022 జనవరి 1 నుంచి ఏటీఎంలల్లో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు చేస్తే రూ.21 బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ప్రతి బ్యాంక్ నెలకు గ్రామీణ ప్రాంతాల్లో అయిదు, నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులకు అనుమతి ఇచ్చింది. ఈ పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసే ప్రతీసారీ ఒక్కో లావాదేవీపై అదనంగా 20 రూపాయలను వసూలు చేస్తోన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+