ATM Cash Withdrawal: భారత బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మోసపూరిత లావాదేవీల నుంచి తన వినియోగదారులను రక్షించడానికి ATMలలో వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ఆధారిత క్యాష్ విత్ డ్రా పద్ధతిని తీసుకొచ్చే పనిలో ఉంది. అనధికారిక లావాదేవీల ద్వారా నష్టం కలగకుండా భద్రత కోసం కొత్త విధానాన్ని బ్యాంకు తీసుకొస్తోంది. దేశంలోని దిగ్గజ బ్యాంకులు సైతం ఈ కొత్త పద్ధతిలోకి మారేందుకు సిద్ధమౌతున్నాయి.

డబ్బు విత్ డ్రా కు ఓటీపీ..
కొత్త విధానం ద్వారా లావాదేవీని పూర్తి చేయడానికి SBI కస్టమర్లు ఇప్పుడు ATMలలో డబ్బును విత్ డ్రా చేసుకునే సమయంలో 4-అంకెల వన్ టైమ్ పాస్వర్డ్ను నమోదు చేయాలి. ఆ తరువాత సిస్టమ్ జనరేట్ చేసిన OTP కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపబడుతుంది. ఈ OTP ఎంటర్ చేయటం ద్వారా నగదు ఉపసంహరణ ధృవీకరించబడుతుంది. ఈ ఓటీపీ కేవలం ఒక్క లావాదేవీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఎంత దాటితే ఏటీపీ తప్పనిసరి..?
SBI జనవరి 1, 2020న OTP ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. అప్పటి నుంచి సేవను పొందాలని కస్టమర్లందరినీ విజ్ఞప్తి చేస్తోంది. బ్యాంక్ సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫారమ్ల ద్వారా ATM మోసాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉంది. లావాదేవీని పూర్తి చేయడానికి SBI కస్టమర్లు ATMలలో ఒక లావాదేవీలో రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ విత్డ్రా చేస్తే OTP అవసరమౌతుంది.

OTP ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడం ఎలా:
1. నగదు విత్డ్రా చేసుకునేటప్పుడు కస్టమర్ తమ డెబిట్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో కూడిన మొబైల్ ఫోన్ని కలిగి ఉండాలి.
2. కస్టమర్ డెబిట్ కార్డ్ను ఇన్సర్ట్ చేసి, విత్డ్రా మొత్తంతో పాటు ATM పిన్ను నమోదు చేసిన తర్వాత OTPని అడుగుతుంది
3. కస్టమర్లు SMS ద్వారా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTPని అందుకుంటారు
4. కస్టమర్ ATM స్క్రీన్పై మెుబైల్ నంబర్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి
5. కస్టమర్లు చెల్లుబాటు అయ్యే OTPని ఎంటర్ చేయటంతో లావాదేవీ పూర్తవుతుంది
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications