ముంబై: ఏటీఎం నుండి పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేసేవారికి షాక్. ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నారు. ఆయా బ్యాంకుకు చెందిన ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకుంటే పరిమిత ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఆ తర్వాత మాత్రం ఛార్జీ వసూలు చేస్తారు. ఈ ఛార్జీని పెంచుతున్నారు. అంటే నిర్ణీత ఉచిత ట్రాన్సాక్షన్స్కు మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నాయి బ్యాంకులు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంత వసూలు చేస్తారు?
ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్కు కస్టమర్ నుండి రూ.21 వసూలు చేయనున్నాయి బ్యాంకులు. ఈ మేరకు బ్యాంకులకు అనుమతిస్తూ ఆర్బీఐ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులు, ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుండి ప్రతి నెల 5 ఉచిత ఆర్థిక, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్ను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి మెట్రో నగరాల్లో అయితే మూడు, నాన్ మెట్రో నగరాల్లో అయితే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ వరకు పరిమితి ఉంది. ఇవి మించితే ప్రస్తుతం ఒక్కో ట్రాన్సాక్షన్ పైన రూ.20 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని రూ.21కి పెంచారు. బ్యాంకులకు రూ.1 పెంచేందుకు ఆర్బీఐ అనుమతించింది.

ఎప్పటి నుండి అమలు
ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం నుండి గతంలో వలె ఐదు ఉచిత ఆర్థిక, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చునని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే ఇతర బ్యాంకుల నుండి మెట్రో నగరాల్లో మూడు ఉచిత ట్రాన్సాక్షన్స్, నాన్ మెట్రో నగరాల్లో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చునని తెలిపింది.

అందుకే ఈ పెంపు
ఏటీఎం కార్యకలాపాల కోసం ఖర్చులు పెరగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఆర్బీఐ బ్యాంకులకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఏటీఎం ట్రాన్సాక్షన్స్కు సంబంధించి హయ్యర్ ఇంటర్చేంజ్ ఫీజును ఆర్థిక కార్యకలాపాలకు రూ.15 నుండి రూ.17కు, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్కు రూ.5 నుండి రూ.6కు పెంచారు. ఈ ఇతర బ్యాంకు ఖాతాదారుల నుండి వసూలు చేసే ఇంటర్చేంజ్ ఫీజును ఆర్బీఐ ఆగస్ట్ నుండి పెంచుతోంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications