Modi Statue: ప్రధాని మోదీ కాంస్య విగ్రహం.. అసోం వ్యాపారి సంచలనం నిర్ణయం..

Statue of Modi: వరుసగా రెండు సార్లు ప్రధాని పదవిలో కొనసాగిన నరేంద్ర మోదీపై దేశవ్యాప్తంగా అభిమానం పెరుగుతోంది. ఇటీవల యూపీలోని అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఆయన చరిష్మా మరింతగా పెరిగింది.

ఈ క్రమంలో అసోంలోని గౌహతికి చెందిన ఒక వ్యాపారవేత్త మోదీపై తన ప్రేమను చాటుకునేందుకు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. నబిన్ చంద్ర బోరా అనే వ్యాపారి గౌహతిలోని జలుక్‌బరిలోని ప్రధాన బస్టాండ్ సమీపంలోని బోరా సొంత స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం మూడు రోజుల పాటు జరిగే భూమి పూజ సోమవారం నుంచి ప్రారంభమైంది.

Assamese businessman Nabin Chandra Bora building modi bronze statue costing 200 crores

అయితే విగ్రహ ఏర్పాటుకు అవుతున్న మెుత్తం రూ.200 కోట్ల ఖర్చును తానే సొంతంగా భరిస్తున్నట్లు బోరా వెల్లడించారు. మెుత్తం 250 అడుగుల ఎత్తు భారీ విగ్రహంలో 60 అడుగుల పునాదిపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. 190 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం మెడలో అస్సామీ సంస్కృతికి చిహ్నంగా ఉండే గమోసా ఉండే కాంస్య విగ్రహ డిజైన్ ఇప్పటికే ఖరారైంది. తాను తలపెట్టిన ఈ మెగా నిర్మాణ ప్రణాళికను సదరు వ్యాపారి ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి పంపినట్లు వెల్లడైంది.

ప్రధాని స్థాయి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తనకు లభించటం తనకు లభించటంపై బోరా సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానికి వీరాభిమాని అయిన నవీన్‌చంద్ర బోరా.. మోదీ చేతుల మీదుగా 2016లో ప్రశంసా పత్రాన్ని కూడా అందుకోవ‌డం జ‌రిగింది. అయితే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరేంద్ర మోదీ హాజరవుతారని ఆశిస్తున్నట్లు బోరా పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+