రికార్డు లాభాలతో ఏషియన్ పెయింట్స్ .. మొదటి త్రైమాసిక ఫలితాల జోరు ఎలా ఉందంటే
దేశీయ పెయింట్స్ సంస్థ ఏషియన్ పెయింట్స్ జూన్ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ లాభాల బాటలో పయనించింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ లాభాలు 161 శాతం పెరిగి 570 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇక ఆదాయం కూడా 91 శాతం పెరగడం కంపెనీ వర్గాలలో జోష్ ను పెంచింది. ఏప్రిల్-జూన్ కాలంలో ఏషియన్ పెయింట్స్ 570 కోట్ల రూపాయల ఏకీకృత లాభాన్ని సంపాదించింది.
అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 218 కోట్లు . మొత్తంగా మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5,580 కోట్లుగా క్యూ 3 ఫలితాలను బట్టి తెలుస్తోంది. స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం ఏషియన్ పెయింట్స్ ఈబిఐటిడిఎ 484 కోట్ల రూపాయల నుండి 1200 కోట్లకు పెరగడం కంపెనీ సాధించిన విజయానికి నిదర్శనం. ఈబిఐటిడిఎ మార్జిన్ కూడా 16.5 శాతం గత సంవత్సరం నుండి 21.7 శాతానికి పెరిగింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో 2870.6 కోట్లు కంపెనీ ఆదాయంగా ఉండగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి 5,580 కోట్లకు చేరుకుంది. పెయింట్ వ్యాపారం ఏబీఐటీ కూడా రూ.371.6 కోట్ల నుంచి రూ.809.1 కోట్లకు పెరిగింది. ఏబీఐటీ మార్జిన్లు కూడా గత ఏడాది 12.9 శాతం నుండి 14.8 శాతానికి పెరిగాయి.
క్యూ 1 ఎఫ్వై 20 తో పోల్చితే ఈ వ్యాపారం విలువ మరియు వాల్యూమ్లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది సాధారణ త్రైమాసికం, ఇది బలమైన స్థిరమైన పథానికి సూచిక అని ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఈఒ అమిత్ సింగిల్ అన్నారు. పారిశ్రామిక వ్యాపారం మరియు గృహ-అభివృద్ధి వ్యాపారం కూడా గత సంవత్సరం కంటే వారి ఆదాయాన్ని రెట్టింపు చేసింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో కొంత వ్యాపారం కొనసాగించిన అంతర్జాతీయ వ్యాపారం, బలమైన రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.