GDP Growth: ప్రపంచం దృష్టి ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థపైనే ఉంది. ప్రధాని మోదీ సైతం భారత్ ఎవ్వరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోందని అన్నారు. తాజాగా జీడీపీ వృద్ధి అంచనాలు ఏమని చెబుతున్నాయో తెలుసుకుందాం..
ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ADB) గురువారం భారతదేశానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 జీడీపీవృద్ధి రేటు అంచనాను 7 శాతానికి పెంచింది. అంతకుముందు వృద్ధి రేటు 6.7 శాతంగా అంచనా వేయబడింది. దేశంలో ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులతో పాటు వినియోగదారుల డిమాండ్ బలమైన వృద్ధికి మార్గం సుగమం చేస్తుందన్నారు. ఆసియా పసిఫిక్లలో భారతదేశం "ప్రధాన వృద్ధి ఇంజిన్"గా కొనసాగుతుందని ADB తన 'ఆసియన్ డెవలప్మెంట్ ఔట్లుక్' ఏప్రిల్ ఎడిషన్లో పేర్కొంది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి ADB భారతదేశ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేసింది. FY2023-24, FY2024-25లో మందగమనం ఉన్నప్పటికీ, వృద్ధి బలంగానే ఉంటుందని పేర్కొంది. అయితే FY2024-25 వృద్ధి అంచనా 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7.6 శాతం కంటే తక్కువగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.7 శాతంగా ఉంటుందని మనీలాకు చెందిన బహుపాక్షిక సంస్థ గతేడాది డిసెంబర్లో అంచనా వేసింది. ద్రవ్యోల్బణంలో తగ్గుదల ధోరణి ప్రపంచ ట్రెండ్లకు అనుగుణంగా కొనసాగుతుందని పేర్కొంది.
సాధారణ రుతుపవనాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుదల, తయారీ & సేవా రంగాలలో నిరంతర వృద్ధి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం ద్రవ్యపరపతి సమావేశం తర్వాత వెల్లడించిన సంగతి తెలిసిందే.
"గ్లోబల్ హెడ్విండ్లు ఉన్నప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, సహాయక విధానాల ద్వారా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది" అని భారతదేశానికి ADB కంట్రీ డైరెక్టర్ మియో ఓకా అన్నారు. 1966లో స్థాపించబడిన ఏడీబీ బ్యాంకు తీవ్రమైన పేదరిక నిర్మూలనకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications