Ashneer Grover: రిజర్వు బ్యాంక్పై ఫిన్టెక్ సీఈవో సీరియస్.. ఏమన్నారంటే..
RBI News: ఇటీవల సెంట్రల్ బ్యాంక్ దేశంలోని యూపీఐ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి కొందరు స్టార్టప్ కంపెనీల సీఈవోలకు మాత్రం అస్సలు మింగుడు పడటం లేదు.
ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై చర్యలను ఫిన్టెక్ సంస్థ BharatPe సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ విమర్శించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ.. ఆర్బీఐ తాజా చర్య దేశంలో బ్యాంకులు ముఖ్యమైనవి, ఫిన్టెక్లు ముఖ్యమైనవి కాదనే సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. గడచిన 10-12 ఏళ్లుగా స్టార్టప్ కంపెనీలు దేశంలో సేంద్రియంగా ఉద్భవించాయని అన్నారు. స్టార్టప్ల స్థాపకులతో ఫొటోలు దిగేందుకు ప్రభుత్వంలోని వ్యక్తులు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ప్రస్తుతం దేశంలో దాదాపు 111 యూనీకార్స్ స్టార్టప్ కంపెనీలున్నాయని గ్రోవర్ పేర్కొన్నారు. అయితే వాటిలో ఏవీ ఆర్థిక వ్యవస్థకు క్రమపద్ధతిలో ముఖ్యమైనవిగా పరిగణించబడలేదన్నారు. అయితే ఈ స్టార్టప్లు భారత జీడీపీని 6-7.5 శాతానికి నడిపించటంలో దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు.
ఈ కంపెనీలు దేశంలోకి భారీగా పెట్టుబడులను తీసుకురావటంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించాయన్నారు. భారత్ పేతో సహా మరిన్ని ఫిన్టెక్ వెంచర్లకు పేటీఎం ప్రేరణగా నిలిచిందని అన్నారు. అందుకే పేటీఎం భారతదేశంలోని అన్ని ఫిన్టెక్ల తండ్రిగా గ్రోవర్ పేర్కొన్నారు. పేటీఎం దేశంలో నగదు ప్రవాహానికి సహాయపడటానికి QR కోడ్ని స్కాన్ చేసే విధానాన్ని సులభతరం చేసిందన్నారు.
చివరిగా గ్రోవర్ రిజర్వు బ్యాంక్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. పేటీఎంపై ఆర్బీఐ శిక్ష కఠినంగా ఉందని పేర్కొంటూ.. యువతపై విశ్వాసం లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని ఆరోపించారు. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యత కలిగిన వ్యక్తులు సాధారణంగా 60 ఏళ్ల వయస్సు వారై ఉంటారని గ్రోవర్ అన్నారు. వారికి బ్యాంకింగ్ వ్యవస్థలను నిర్వహించడంలో అనుభవం ఉంటుంది కానీ 40 ఏళ్ల వ్యక్తిపై అనుమానం కూడా ఉందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications