RBI News: ఇటీవల సెంట్రల్ బ్యాంక్ దేశంలోని యూపీఐ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి కొందరు స్టార్టప్ కంపెనీల సీఈవోలకు మాత్రం అస్సలు మింగుడు పడటం లేదు.
ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై చర్యలను ఫిన్టెక్ సంస్థ BharatPe సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ విమర్శించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ.. ఆర్బీఐ తాజా చర్య దేశంలో బ్యాంకులు ముఖ్యమైనవి, ఫిన్టెక్లు ముఖ్యమైనవి కాదనే సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. గడచిన 10-12 ఏళ్లుగా స్టార్టప్ కంపెనీలు దేశంలో సేంద్రియంగా ఉద్భవించాయని అన్నారు. స్టార్టప్ల స్థాపకులతో ఫొటోలు దిగేందుకు ప్రభుత్వంలోని వ్యక్తులు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ప్రస్తుతం దేశంలో దాదాపు 111 యూనీకార్స్ స్టార్టప్ కంపెనీలున్నాయని గ్రోవర్ పేర్కొన్నారు. అయితే వాటిలో ఏవీ ఆర్థిక వ్యవస్థకు క్రమపద్ధతిలో ముఖ్యమైనవిగా పరిగణించబడలేదన్నారు. అయితే ఈ స్టార్టప్లు భారత జీడీపీని 6-7.5 శాతానికి నడిపించటంలో దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు.
ఈ కంపెనీలు దేశంలోకి భారీగా పెట్టుబడులను తీసుకురావటంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించాయన్నారు. భారత్ పేతో సహా మరిన్ని ఫిన్టెక్ వెంచర్లకు పేటీఎం ప్రేరణగా నిలిచిందని అన్నారు. అందుకే పేటీఎం భారతదేశంలోని అన్ని ఫిన్టెక్ల తండ్రిగా గ్రోవర్ పేర్కొన్నారు. పేటీఎం దేశంలో నగదు ప్రవాహానికి సహాయపడటానికి QR కోడ్ని స్కాన్ చేసే విధానాన్ని సులభతరం చేసిందన్నారు.
చివరిగా గ్రోవర్ రిజర్వు బ్యాంక్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. పేటీఎంపై ఆర్బీఐ శిక్ష కఠినంగా ఉందని పేర్కొంటూ.. యువతపై విశ్వాసం లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని ఆరోపించారు. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యత కలిగిన వ్యక్తులు సాధారణంగా 60 ఏళ్ల వయస్సు వారై ఉంటారని గ్రోవర్ అన్నారు. వారికి బ్యాంకింగ్ వ్యవస్థలను నిర్వహించడంలో అనుభవం ఉంటుంది కానీ 40 ఏళ్ల వ్యక్తిపై అనుమానం కూడా ఉందని పేర్కొన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications