Wipro Stock: కొంత కాలం నష్టాలను చూసిన తర్వాత ఇటీవలి కాలంలో దేశంలోని ఐటీ రంగంలోని లిస్టెడ్ కంపెనీల షేర్లు తిరిగి పుంజుకోవటం మెుదలెట్టాయి. మార్కెట్లు సైతం గడచిన నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభాల్లో క్లోజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విప్రో కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు వింత అనుభవం ఏర్పడింది.
డిసెంబర్ 3న ఒక్కసారిగా తమ పోర్ట్ఫోలియోను చూసుకున్న విప్రో ఇన్వెస్టర్లకు ఏకంగా గుండెపోటు వచ్చినంత పనైంది. దీనికి కారణం వారి పోర్ట్ ఫోలియో విలువ అకస్మాత్తుగా సగానికి పడిపోవటమే. చాలా కాలం తర్వాత డీమ్యాట్ ఖాతాలో తమ హోల్డింగ్స్ గురించి చూసుకుందాంలే అనుకుంటూ ఓపెన్ చేసిన చాలా మంది షాక్ కి గురయ్యారు. ఒక్కసారిగా వారి పెట్టుబడి విలువ సగానికి పడిపోవటంతో ఎందుకిలా జరిగిందని చింతించాల్సిన అవసరం లేదు బ్రదర్స్. డిసెంబర్ 2న ట్రేడింగ్ ముగింపు నాటికి రూ.585 వద్ద ఉన్న షేర్ ధర తర్వాత రోజు ఒక్కోటి రూ.291.80 వద్ద ఉంది. దీనికి అసలు కారణం డిసెంబర్ 3, 2024న విప్రో స్టాక్ బోనస్ ఇష్యూ ఎక్స్-డేట్ కావటంతో స్టాక్ ధర సగానికి పడిపోయిందని నిపుణులు వెల్లడించారు.

ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించటంలో టెక్ దిగ్గజం విప్రోకు పెద్ద చరిత్రే ఉంది. మరే ఇతర ఐటీ కంపెనీ ఇవ్వనన్ని సార్లు విప్రో తన పెట్టుబడిదారులను లిస్టింగ్ నుంచి ఇప్పటి వరకు రివార్డ్ చేసింది. ఈ క్రమంలోనే ఈసారి టెక్ దిగ్గజం తన పెట్టుబడిదారులకు 1:1 రేషియోలో ఉచితంగా బోనస్ షేర్లను జారీ చేసింది. దీని ప్రకారం కంపెనీ పుస్తకాల్లో ఎక్స్ డేట్ నాటికి షేర్ హోల్డర్లుగా పేర్లున్న అర్హులు కంపెనీ ప్రకటించిన ఉచిత షేర్లను డీమ్యాట్ ఖాతాల్లో అందుకుంటారు. ఉదాహరణకు మీరు 100 షేర్లను నిర్థేశించిన తేదీనాటికి కలిగి ఉంటే ప్రస్తుతం వారికి 100 షేర్లు బోనస్ రూపంలో అందించబడ్డాయి. అందువల్ల పెట్టుబడిదారుల ఖాతాల్లో దీనికి అనుగుణంగా షేర్ల సర్థుబాటు జరిగింది. అందువల్ల షేర్ల విలువ సగానికి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. మెుత్తానికి అదే విలువకు అధిక షేర్లను ఇన్వెస్టర్లు ప్రస్తుతం దీని ప్రకారం కలిగి ఉన్నారు.
కంపెనీ బోనస్ ఇష్యూ చరిత్ర..
కంపెనీ చరిత్రను పరిశీలిస్తే 1971లో తొలిసారిగా తన పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ క్రమంలోనే 1981-1996 మధ్యకాలంలో టెక్ దిగ్గజం దాదాపు 6 సార్లు బోనస్ షేర్లు అందించింది. దీని తర్వాత 1997, 2004, 2005, 2010, 2017, 2019 సంవత్సరాల్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను రివార్డ్ చేసింది. దేశీయంగా ఉన్న ఇతర టెక్ కంపెనీలతో పోల్చితే విప్రో తన పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందించింది. సహజంగా మార్కెట్లో కంపెనీ షేర్లకు లిక్విడిటీ పెంచటానికి కంపెనీ తన పెట్టుబడిదారులకు షేర్లను రివార్డ్ చేస్తుంటాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications