కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది. దింతో ప్రతినెలలాగే ఏప్రిల్ 1 నుండి కొన్ని రూల్స్ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇవి సామాన్యుడి ఆదాయం పై కాస్త ప్రభావం చూపవచ్చు. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో అతిపెద్ద మార్పు ఆదాయపు పన్ను నియమాలలో జరిగింది. ఏంటంటే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారు. దింతో కొత్త పన్ను విధానం కింద ఉన్నవారు ఈ బెనిఫిట్ పొందుతారు. దీనితో పాటు UPI ట్రాన్సక్షన్స్ సహా కొన్ని రూల్స్ ఇవాళ్టి నుండి మారనున్నాయి.

ట్యాక్స్ రూల్స్ మార్పులు: ఏప్రిల్ 1 నుండి ఆదాయపు పన్ను నియమాలు మారాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉంటే పన్ను మినహాయింపును ప్రకటించారు. అదనంగా వేతన జీవులు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000 అదనపు మినహాయింపు లభిస్తుంది. ఈ విధంగా రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
UPI అకౌంట్స్ క్లోజ్ :ఏప్రిల్ 1 నుండి UPI ట్రాన్సక్షన్స్ రూల్స్ మారబోతున్నాయి. చాలా కాలంగా ఉపయోగించని మొబైల్ నంబర్లకు లింక్ చేసిన UPI అకౌంట్స్ బ్యాంక్ రికార్డుల నుండి తొలగించబడతాయి. మీ ఫోన్ నంబర్ UPI యాప్కి లింక్ చేసి మీరు దానిని చాలా కాలంగా ఉపయోగించకపోతే బ్యాంక్ దానిని రికార్డుల నుండి తొలగిస్తుంది అలాగే మీ అకౌంటుకు UPI సర్వీసెస్ నిలిపివేస్తుంది. కాబట్టి, మీరు UPI ఉపయోగిస్తుంటే మీ అకౌంట్ యాక్టివ్గా ఉంచుకోవాలి.
FDs మరింత ప్రయోజనకరంగా : మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెడితే మీకో గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు FD, RD అండ్ ఇతర సేవింగ్స్ స్కీమ్స్ పై రూ.1 లక్ష వరకు వడ్డీపై TDS కోత ఉండదు. అయితే ఈ బెనిఫిట్ సీనియర్ సిటిజన్లకు కల్పించారు. అంతేకాదు ఇతర పెట్టుబడిదారులకు కూడా రిలీఫ్ అందిస్తూ వారికి ఈ పరిమితిని రూ.40 వేల నుండి రూ.50 వేలకు పెంచారు. అంటే, ఒక సీనియర్ సిటిజన్ ఒక సంవత్సరంలో FD పై రూ. 1 లక్ష వరకు వడ్డీ పొందితే, దానిపై ఎటువంటి TDS ఉండదు.
GST నియమాలలో మార్పులు: భారత ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరంలో GST నియమాలలో పెద్ద మార్పులు చేస్తోంది. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD) సిస్టం అమలు చేయబోతున్నారు. ఈ మార్పు GST వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించే దిశగా ఒక పెద్ద అడుగు.
పాజిటివ్ పే సిస్టమ్: బ్యాంకుల మోసాలను నివారించడానికి, RBI పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ను అమలు చేసింది. ఇప్పటికే చాల బ్యాంకులు ఈ సిస్టం అమలు చేస్తున్నాయి. PPS కింద, మీరు రూ. 50,000 కంటే ఎక్కువ చెక్కును జారీ చేస్తే, మీరు చెక్కు గురించి కొంత సమాచారాన్ని ఎలక్ట్రానిక్గా బ్యాంకుకు అందించాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications