GPS: ఈ రోజుల్లో ఇల్లు కదలాలంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే, అందులో గూగుల్ మ్యాప్స్ వినియోగించాల్సిందే. ప్రయాణాల నుంచి ఫుడ్ ఆర్డరింగ్ వరకు నావిగేషన్ కు గాను ఈ GPS సాంకేతికత తప్పనిసరి అయిపోయింది. ఈ అమెరికా టెక్నాలజీకి బదులు భారత్ రూపొందించిన కొత్త సాంకేతికత ఇప్పుడు మొబైల్స్ లో కనిపించనుంది.
పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సేవల్ని అందిస్తున్న GPSకు ప్రత్యామ్నాయంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 'నావిక్'ను తయారు చేసింది. భూమి, ఆకాశం, సముద్రంతో పాటు సర్వే, పరిశోధన, లొకేషన్ మొదలైన అన్ని అవసరాల కోసం ఇది సేవలు అందిస్తుంది. ఇందుకోసం 2018లో 7 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది.

నావిక్ అప్లికేషన్ సపోర్ట్ చేసే విధంగా స్మార్ట్ ఫోన్లు తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొంతకాలంగా శామ్సంగ్, ఆపిల్ వంటి దిగ్గజ మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలను కోరుతోంది. కాగా ఈ సాంకేతికత ఇప్పుడు ఆపిల్ ఐఫోన్ 15 ద్వారా మొదటిసారిగా ప్రజలకు విరివిగా అందుబాటులోకి రానుంది.
భారత సరిహద్దులను దాటి 1,500 కిలోమీటర్ల ప్రాంతాన్ని నావిక్ కవర్ చేస్తుంది. దీని సిగ్నల్స్ అత్యంత ఖచ్చితంగా ఉంటాయని ఇస్రో చెబుతోంది. 20 మీటర్ల లోపే వినియోగదారుడి లొకేషన్, 50 నానోసెకన్ల కంటే మెరుగైన టైమింగ్ యాక్యురసీ దీని సొంతమని పేర్కొంది.
1999 కార్గిల్ యుద్ధ సమయంలో GPS డేటాను భారత సైన్యానికి అందించేందుకు అమెరికా నిరాకరించింది. తద్వారా క్లిష్టమైన సమాచారం అందకుండా అడ్డుకుంది. భవిష్యత్తులో ఈ తరహా పరిస్థితులు తలెత్తితే ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా నిర్ణయించింది. 2006లో ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications