Apollo Hospitals: దేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్పిటల్స్ నెట్వర్క్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్. దీనిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార కుటుంబం నిర్వహిస్తోంది. పైగా ఇది హీరో రామ్ చరణ్ భార్య కుటుంబానికి చెందిన సంస్థ.
తాజాగా అపోలో హాస్పిటల్స్ సంస్థ తన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. గడచిన క్వార్టర్లో కంపెనీ రూ.146 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఏదే కాలంలో కంపెనీ లాభం రూ.97 కోట్లతో పోల్చితే ఇది 50.5 శాతం అధికం. అయితే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసిన రూ.198 కోట్లను అందుకోవటంలో హాస్పిటల్ సంస్థ విఫలమైంది. దీంతో ఇన్వెస్టర్లు కొంత నిరాశకు గురయ్యారు.

మెరుగైన ఆక్యుపెన్సీ బలమైన లాభాలను నమోదు చేయటానికి దోహదపడినట్లు తెలుస్తోంది. త్రైమాసికంలో ఆదాయం 21.3 శాతం పెరిగి రూ.4,302.2 కోట్లకు చేరుకుంది. ఇది రూ.4,302.7 కోట్ల అంచనాలకు అనుగుణంగా ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.3,546.4 కోట్లుగా ఉంది. అయితే అపోలో హెల్త్కో వ్యాపారం వైపు చేసిన పెట్టుబడుల కారణంగా నిర్వహణ పనితీరు ఇప్పటికీ ఒత్తిడిలో ఉంది.
మునుపటి త్రైమాసికంలో అపోలో మేనేజ్మెంట్ దాని హెల్త్కో ఆర్మ్లో నష్టాలు Q4లో గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, FY24 రెండవ సగంలో బ్రేక్ఈవెన్ని అంచనా వేయడంతో రికవరీ దిశగా సాగుతుందని తెలిపింది. నాలుగో త్రైమాసికంలో డిజిటల్ ఆర్మ్ నష్టాలు పెరగటంతో విశ్లేషకులు, ఇన్వెస్టర్లు.. డిజిటల్ వ్యాపారం, హాస్పిటల్ విభాగానికి సంబంధించిన ఔట్లుక్పై మేనేజ్మెంట్ కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

రానున్న 6 నెలల కాలంలో అపోలో హెల్త్కోలో వచ్చే నష్టాలను పూడ్చేందుకు అంతర్గత వనరుల నుంచి నిధులను సమకూరుస్తామని కూడా కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం రానున్న త్రైమాసికాల్లో కూడా మార్జిన్ల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో అపోలో హాస్పిటల్స్ కంపెనీ షేర్ల ధర రూ.4,600 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications