ఏపీలోని వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందన్ని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. గూగుల్ తరహాలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో రిలయన్స్ సంస్థ ఏకంగా ఒక గిగా వాట్ ఏఐ డేటా సెంటర్ను పెట్టే దిశగా ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గిగా వాట్ డేటా సెంటర్
ప్రస్తుతం విశాఖపట్నంలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో రకరకాల కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రిలయన్స్ సంస్థ ఏపీలో భారీ ఏఐ డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకొచ్చింది. ఏపీలో ఏఐ డేటా సెంటర్తో పాటు సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన భేటీలో ఈ విషయాలు వెల్లడించారు. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్లో అడ్వాన్స్డ్ జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్లు అమర్చనున్నారు. ప్రస్తుతం గుజరాత్లో ఉన్న రిలయన్స్ గిగావాట్- ఏఐ డేటా సెంటర్కు అనుబంధంగా దీన్ని నిర్మించనున్నారు. ఈ రెండు డేటా సెంటర్లకై రిలయన్స్ సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు సమాచారం.
సోలార్ ప్లాంట్
డేటా సెంటర్ ఏర్పాటుతోపాటు ఈ సెంటర్కు స్థిరమైన పవర్ సప్లై ఇచ్చేందుకు గానూ 6 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటుచేసేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. దీంతోపాటు కర్నూల్ లో 170 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ను కూడా ఏర్పాటుచేయబోతోంది. ఇందులో డ్రింకింగ్ వాటర్ సహా పలు ఇతర ఉత్పత్తులను తయారుచేసే ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ వేల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుంది.
లక్షల్లో ఉద్యోగాలు
ఇకపోతే ఈ సమ్మిట్లో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం 400లకు పైగా ఎంవోయూలు కుదుర్చుకుంది. సుమారు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి రానున్నట్టు తెలుస్తోంది. వీటిలో బ్రూక్ ఫీల్డ్ ద్వారా సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడి, ReNew ద్వారా రూ. 82 వేల కోట్ల పెట్టుబడి, SAEL ఇండస్ట్రీస్ ద్వారా రూ. 22 వేల కోట్ల పెట్టుబడి, HERO ఫ్యూచర్ ఎనర్జీస్ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా సమారు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications