ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 480 ఎకరాల భూమిని అదానీ ఇన్ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ కంపెనీకి చెందిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన 1 గిగావాట్ (GW) సామర్థ్యం గల భారీ AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం ఈ భూకేటాయింపు చేపట్టారు.రైడెన్ ఇన్ఫోటెక్కు ప్రభుత్వ సహకారం మేరకు.. అదానీ ఇన్ఫ్రా ఈ ప్రాజెక్ట్లో నోటిఫైడ్ భాగస్వామిగా వ్యవహరించనుందని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వెల్లడించారు.
డిసెంబర్ 2న జారీ చేసిన ఉత్తర్వులో.. గూగుల్ ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైడెన్ భాగస్వాముల జాబితాను అందజేసిందని పేర్కొంది. అదానీ ఇన్ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్తో పాటు అదానీకన్నెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా నోటిఫైడ్ భాగస్వాములుగా గుర్తించబడ్డాయి. రైడెన్ ప్రత్యేకంగా చేసిన అభ్యర్థన మేరకు.. APIIC గుర్తించిన భూభాగాలను వివరమైన సర్వే, స్వాధీనం ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత అదానీ ఇన్ఫ్రాకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఏపీ మంత్రి మండలి సమావేశంలో 28 నవంబర్ 2025న జరిగిన చర్చ తర్వాత ప్రభుత్వం అధికారికంగా అనుమతి ప్రకటించింది. ఈ 480 ఎకరాల భూమి బదిలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా రూ.87,500 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకాల రూపంలో రూ.22,000 కోట్ల రీఫండ్ ప్రయోజనం రైడెన్తో పాటు దాని భాగస్వాములకు అందజేయబడుతుందని ఉత్తర్వులు స్పష్టం చేశాయి.
ప్రాజెక్ట్లో భాగంగా డేటా సెంటర్, గూగుల్ యొక్క సెర్చ్, యూట్యూబ్, వర్క్స్పేస్ వంటి ప్రముఖ సేవలకు శక్తినిచ్చే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడనుంది. డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధారణంగా అది వినియోగించే విద్యుత్ ఆధారంగా గుర్తిస్తారు. మొత్తం సామర్థ్యంతో ప్రారంభమైనప్పుడు ప్రతిపాదించిన విశాఖ డేటా సెంటర్ 1 GW అంటే 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. ఇది ముంబై వార్షిక విద్యుత్ వినియోగంలో దాదాపు 50 శాతానికి సమానం కావడం ఈ ప్రాజెక్ట్ పరిమాణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ డిజిటల్ సేవల మ్యాప్లో అత్యంత కీలక స్థానం సంపాదించబోతున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డేటా స్టోరేజ్, AI కంప్యూటింగ్ పవర్, హై-పర్ఫార్మెన్స్ క్లౌడ్ సేవలు, భారీ స్థాయి డిజిటల్ బ్యాకప్ నెట్వర్కులు వంటి అనేక విభాగాలకు ఇది కేంద్రంగా నిలుస్తుంది. వేలాది నైపుణ్య ఉద్యోగాల సృష్టితో పాటు, భారీ ఆర్థిక కార్యకలాపాల ప్రవాహం కూడా చోటుచేసుకోనుంది.
గతంలో గూగుల్ ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇప్పుడు 15 బిలియన్ డాలర్లకు పెరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వెల్లడించారు. ఆయన ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్ డిజిటల్ ఎకానమీకి మెరుగైన అవకాశాలను తెస్తుందని.. విశాఖపట్నాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చే దిశగా ఇది అపూర్వమైన అడుగు అని పేర్కొన్నారు.
More From GoodReturns

AI వల్లే కంపెనీ నుంచి వెళ్లిపోతున్నాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ కంపెనీల సీఈఓలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications