AP Investments: ప్రస్తుతం పెట్టుబడుల విషయంలో ఏపీ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు మళ్లిన సీఎం చంద్రబాబు అంతే వేగంగా ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందేలా చేస్తున్నారు. ప్రతినెల భారీ స్థాయిలో కొత్త ప్రాజెక్టులను ఏపీకి తీసుకురావటం కోసం కూటమి ప్రభుత్వంలోని మంత్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో వేగంగా మౌలిక వసతులతో పాటు అవసరమైన ఇతర కేటాయింపులను వారు పూర్తి చేస్తున్నారు.
దాదాపుగా వారం రోజుల కిందట డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఏపీలోని సత్యసాయి జిల్లా మడకసిరలో పెట్టుబడులు పెట్టనుందనే వార్త బయటకు వచ్చింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కంపెనీ తన ఫిరంగులు, పేలుడు పదార్థాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.2,400 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు వెల్లడైంది. దేశ రక్షణ కోసం కంపెనీ అనేక అత్యాధునిక రక్షణ పరికరాలు, క్షిపణుల కోసం అవసరమైన పేలుడు పదార్థాల తయారీలో ప్రసిద్ధి చెందింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కంపెనీకి ఇందుకోసం 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రానున్న రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరో 500 ఎకరాలను అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది.

ఈ ఏర్పాటు వల్ల దాదాపు 550 మంది నైపుణ్యం కలిగిన, సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి కల్పించబడుతుందని అంచనా వేయబడింది. కంపెనీ తన అంతర్గత పరీక్షలు, టెస్ట్ ఫైరింగ్ కోసం ఎక్కువగా భూమి అవసరం ఉంటుందని ప్రభుత్వానికి వెల్లడించటంతో ఏపీ అవసరమైన స్థలాన్ని అందించటానికి ముందుకొచ్చింది. ఫేజ్ వన్ కింద రూ.1000 కోట్లు, చివరి దశలో రూ.1500 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్ ఫోర్జ్ అసాల్ట్ రైఫిల్, లైట్ మెషిన్ గన్, కార్బైన్ అండ్ పిస్టల్తో సహా అనేక రకాల చిన్న ఆయుధాలను కూడా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఫిలిప్స్ కార్భన్ బ్లాక్ లిమిటెడ్ కంపెనీ కోసం 116.62 ఎకరాల భూమిని తాజాగా అలాట్ చేసింది. కంపెనీ రూ.3,798 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేట్ ఇండస్ట్రియల్ పార్కులో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకు రావటంతో అందుకు అవసరమైన స్థల కేటాయింపులను ప్రభుత్వం పూర్తి చేసింది. కంపెనీ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ రానున్న రోజుల్లో 200 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తేలింది. కంపెనీ ఈ ప్లాంటులో రబ్బర్ బ్లాక్ తో పాటు వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను ఇక్కడి నుంచి తయారు చేస్తోందని నిపుణులు చెప్పారు. ఇదే క్రమంలో ఏపీలో మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ టీమ్ నిరంతరం కృషి చేస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications