AP Liquor: మందుబాబులకు చంద్రబాబు సర్కార్ ఝలక్.. సరికొత్త నిర్ణయం..!!

AP Liquor Rates: ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం లిక్కర్ పాలసీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీగా దరఖాస్తులు అందాయి. ప్రధానంగా విదేశాల్లో ఉంటున్న కొందరు ఔత్సాహికులు తమ కుటుంబ సభ్యుల పేరుమీద లిక్కర్ షాపుల కోసం దరఖాస్తులు వేసినట్లు వెల్లడైంది. ఈసారి నాన్ రిఫండబుల్ డిపాజిట్ రూ.2 లక్షలు పెట్టినప్పటికీ దరఖాస్తుల జోరు కొనసాగిందని అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో గడువు సమయంలో మెుత్తం 3396 మద్యం షాపులకు 65 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ విదేశీ మద్యం అమ్మకపు రేట్ల విషయంలో మందుబాబులకు ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలోనే తయారవుతున్న విదేశీ మద్యం విషయంలో బాటిపై ఉండే ధరపై ప్రవిలేజీ ఫీజును వసూలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ ఒక్కో బాటిపై ఉండే ధరకు రూ.10 ప్రివిలేజీ ఫీజుగా వసూలు చేయనున్నారు. ఉదాహరణకు బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 గా ఉంటే దాన్ని రూ.160కి ప్రివిలేజ్ ఫీజు పెంచబడుతుంది.

AP Gov Imposed Additional Previlege fee on Liquor for Imported liquor shocking all

మరో మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం పాలసీ కింద ఏపీలో లిక్కర్ కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయి. ఈ మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఈ లెక్కన మద్యం బాటిళ్ల ధర రూ.160 కంటే 50 పైసలు ఎక్కువగా ఉన్నాసరే దానిని రూ.170కి విక్రయించబడతాయని తెలుస్తోంది. అలాగే లిక్కర్ ధర బాటిల్ పై రూ.250.50 ఉంటే దానిని రూ.260కి విక్రయిస్తారని తెలుస్తోంది. కానీ స్టార్టింగ్ ధర రూ.99 కింద విక్రయించే లిక్కర్ విషయంలో మాత్రం ఇది వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రేపు జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో కొత్త లిక్కర్ షాపుల లైసెన్సుల జారీకి లాటరీలు తీసే కార్యక్రమం జరగనుంది. దీని తర్వాత 16 నుంచి కొత్త మద్యం షాపులు తెరుకుంటాయని తెలుస్తోంది.

గతంలో మద్యం షాపుల వేలంలో పాల్గొనే వ్యక్తులు డిపాజిట్ చేసిన సొమ్ము రీఫండ్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏపీ సర్కార్ తెలంగాణ మాదిరిగా కొత్త లైసెన్సింగ్ పాలసీని తీసుకురావటంతో డబ్బులు ఉన్నోళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు మద్యం షాపులకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లైసెన్సు పొందాలంటే రూ.55 లక్షల నుంచి 85 లక్షల వరకూ ఫీజులు నిర్ణయించారు. అయినా వీటికి భారీ స్పందన వస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 దరఖాస్తులు రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దీంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+