AP Liquor Rates: ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం లిక్కర్ పాలసీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీగా దరఖాస్తులు అందాయి. ప్రధానంగా విదేశాల్లో ఉంటున్న కొందరు ఔత్సాహికులు తమ కుటుంబ సభ్యుల పేరుమీద లిక్కర్ షాపుల కోసం దరఖాస్తులు వేసినట్లు వెల్లడైంది. ఈసారి నాన్ రిఫండబుల్ డిపాజిట్ రూ.2 లక్షలు పెట్టినప్పటికీ దరఖాస్తుల జోరు కొనసాగిందని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో గడువు సమయంలో మెుత్తం 3396 మద్యం షాపులకు 65 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ విదేశీ మద్యం అమ్మకపు రేట్ల విషయంలో మందుబాబులకు ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలోనే తయారవుతున్న విదేశీ మద్యం విషయంలో బాటిపై ఉండే ధరపై ప్రవిలేజీ ఫీజును వసూలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ ఒక్కో బాటిపై ఉండే ధరకు రూ.10 ప్రివిలేజీ ఫీజుగా వసూలు చేయనున్నారు. ఉదాహరణకు బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 గా ఉంటే దాన్ని రూ.160కి ప్రివిలేజ్ ఫీజు పెంచబడుతుంది.

మరో మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం పాలసీ కింద ఏపీలో లిక్కర్ కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయి. ఈ మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఈ లెక్కన మద్యం బాటిళ్ల ధర రూ.160 కంటే 50 పైసలు ఎక్కువగా ఉన్నాసరే దానిని రూ.170కి విక్రయించబడతాయని తెలుస్తోంది. అలాగే లిక్కర్ ధర బాటిల్ పై రూ.250.50 ఉంటే దానిని రూ.260కి విక్రయిస్తారని తెలుస్తోంది. కానీ స్టార్టింగ్ ధర రూ.99 కింద విక్రయించే లిక్కర్ విషయంలో మాత్రం ఇది వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రేపు జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో కొత్త లిక్కర్ షాపుల లైసెన్సుల జారీకి లాటరీలు తీసే కార్యక్రమం జరగనుంది. దీని తర్వాత 16 నుంచి కొత్త మద్యం షాపులు తెరుకుంటాయని తెలుస్తోంది.
గతంలో మద్యం షాపుల వేలంలో పాల్గొనే వ్యక్తులు డిపాజిట్ చేసిన సొమ్ము రీఫండ్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏపీ సర్కార్ తెలంగాణ మాదిరిగా కొత్త లైసెన్సింగ్ పాలసీని తీసుకురావటంతో డబ్బులు ఉన్నోళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు మద్యం షాపులకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లైసెన్సు పొందాలంటే రూ.55 లక్షల నుంచి 85 లక్షల వరకూ ఫీజులు నిర్ణయించారు. అయినా వీటికి భారీ స్పందన వస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 దరఖాస్తులు రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దీంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications