అమరావతి: పేదలకు వైద్య చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ సరుకుల కోసం బియ్యం కార్డులు జారీ చేసేందుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపుల కోసం కొత్త పథకం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు, వైయస్సార్ నవశకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి వాటికి ఆమోదం తెలిపింది. అలాగే, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీపై కూడా చాలామందికి ఊరట కల్పించింది.

ఆదాయ పరిమితి డబుల్
ఏపీలో కొత్త బియ్యం కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఆదాయ పరిమితుల్లో మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల నుంచి రూ.10,000కు (సంవత్సరానికి రూ.1.20 లక్షలు) పెంచారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6,500 నుంచి రూ.12,000కు (సంవత్సరానికి రూ.1.44 లక్షలు) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బిలో పావర్టీ లైన్ (BPL) ఆదాయ పరిమితిని చివరిసారి 2008లో సవరించారు. దీనిని మళ్లీ సవరించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.

పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ
అర్హులందరికీ బియ్యం కార్డులు ఇస్తారు. అర్హులైనా లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, కార్డులు జారీ చేస్తారు. రేషన్ సరుకుల కోసం ప్రత్యేకంగా బియ్యం కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య చికిత్సల కోసం ప్రత్యేకంగా పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కార్డ్స్ జారీ చేయనున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు రేషన్, విద్యా దీవెన వంటి పథకాలకు వేర్వేరు కార్డులు జారీ చేస్తారు.

వారందరికీ కార్డులు..
అమ్మఒడి మొదలు ఫీజు రీయింబర్స్మెంట్స్ వరకు ప్రత్యేక కార్డుల జారీకి సిద్ధమైంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ కార్డుల ముద్రణ చేపట్టనుంది. డిసెంబరు నాటికి నవశకం కార్యక్రమం ద్వారా సర్వే పూర్తి చేసి 2020 జనవరి ఒకటో తేదీ నుంచి కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నారు. పథకాల అమలుకు మాగాణి, మెట్ట భూమి పరిమితి ఉంది. కాబట్టి ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు కూడా కార్డులు చేతికి రానున్నాయి. కార్డుల ముద్రణ కోసం పౌరసరఫరాల శాఖ రూ.20 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications