అమరావతి: పేదలకు వైద్య చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ సరుకుల కోసం బియ్యం కార్డులు జారీ చేసేందుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపుల కోసం కొత్త పథకం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు, వైయస్సార్ నవశకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి వాటికి ఆమోదం తెలిపింది. అలాగే, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీపై కూడా చాలామందికి ఊరట కల్పించింది.

ఆదాయ పరిమితి డబుల్
ఏపీలో కొత్త బియ్యం కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఆదాయ పరిమితుల్లో మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల నుంచి రూ.10,000కు (సంవత్సరానికి రూ.1.20 లక్షలు) పెంచారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6,500 నుంచి రూ.12,000కు (సంవత్సరానికి రూ.1.44 లక్షలు) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బిలో పావర్టీ లైన్ (BPL) ఆదాయ పరిమితిని చివరిసారి 2008లో సవరించారు. దీనిని మళ్లీ సవరించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.

పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ
అర్హులందరికీ బియ్యం కార్డులు ఇస్తారు. అర్హులైనా లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, కార్డులు జారీ చేస్తారు. రేషన్ సరుకుల కోసం ప్రత్యేకంగా బియ్యం కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య చికిత్సల కోసం ప్రత్యేకంగా పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కార్డ్స్ జారీ చేయనున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు రేషన్, విద్యా దీవెన వంటి పథకాలకు వేర్వేరు కార్డులు జారీ చేస్తారు.

వారందరికీ కార్డులు..
అమ్మఒడి మొదలు ఫీజు రీయింబర్స్మెంట్స్ వరకు ప్రత్యేక కార్డుల జారీకి సిద్ధమైంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ కార్డుల ముద్రణ చేపట్టనుంది. డిసెంబరు నాటికి నవశకం కార్యక్రమం ద్వారా సర్వే పూర్తి చేసి 2020 జనవరి ఒకటో తేదీ నుంచి కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నారు. పథకాల అమలుకు మాగాణి, మెట్ట భూమి పరిమితి ఉంది. కాబట్టి ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు కూడా కార్డులు చేతికి రానున్నాయి. కార్డుల ముద్రణ కోసం పౌరసరఫరాల శాఖ రూ.20 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications