AP News: సీఎం చంద్రబాబు అస్త్రం.. ఏపీలో మరో హైటెక్ సిటీ.. టార్గెట్ రేవంత్ రెడ్డేనా..?

Chandrababu News: ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారటానికి సీఎం చంద్రబాబు చేసిన కృషి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ-తెలంగాణ విడిపోయిన తర్వాత మరో హైటెక్ సిటీని ఏపీలో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సర్కార్ విశాఖ సమీపంలో డేటా సిటీ, హౌసింగ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌లను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం విశాఖకు సమీపంలో అభివృద్ధి చేస్తున్న డేటా సిటీ రానున్న కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని తెలుస్తోంది. గతంలో హైదరాబాదులో హైటెక్ సిటీని నిర్మించిన అనుభవంతో దానిని తిరిగి ఇక్కడ అనుకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో గూగుల్, టీసీఎస్ ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ మంత్రి లోకేష్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.

AP CM Chandrababu planning to make Vizag as Hitech City 2 0 with Data City AI Hubs

ఇదే క్రమంలో ఇటీవలి దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో విశాఖలో డిజైన్ సెంటర్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఇక్కడ సర్వర్లలో ఉపయోగించే చిప్స్ తయారీకి ఉన్న అవకాశాన్ని పరిశీలించమన్నారు. అలాగే సర్వర్ల సర్వీసింగ్ కోసం కీలక కేంద్రంగా ఏపీని పరిగణించాలని కోరారు. ఇప్పటికే గూగుల్ క్లౌడ్ తన డిజైన సెంటర్లను దిల్లీ, ముంబైలలో ఏర్పాటు చేసిన తరుణంలో ఈ చర్చలు వచ్చాయి. అలాగే విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు గూగుల్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

ఇదే ప్రణాళికపై ఐటీ మంత్రి నారా లోకేష్ కొన్ని వారాల ముందు మాట్లాడిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంను ప్రపంచంలోనే డేటా హబ్‌గా మార్చడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి విశాఖ మోదీ పర్యటన సమయంలో పునాది కూడా వేశారు. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. దీనిని పూర్తి స్థాయిలో పూర్తి చేయటం వల్ల లక్షల్లో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు రావటం కూడా విశాఖ టెక్ హబ్ గా మార్చటానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఐటీ కంపెనీలు బెంగళూరు, చెన్నై, పూణే, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టెక్ పరిశ్రమంతో ఎక్కువ సంబంధం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న కాలంలో ఇప్పటికే గుర్తింపు పొందిన నగరాల సరసన విశాఖను చేర్చుతారనే నమ్మకం కలుగుతోంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు, హెల్త్ కేర్ వంటి రంగాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+