AP News: కొన్న రోజుల కిందట అమెరికా కోర్టులు భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన సోలార్ విద్యుత్ అమ్మకానికి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఎరచూపినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసినప్పటికీ.. ఏపీలో మాత్రం పెద్ద రాజకీయ దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో జరిగిన డీల్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో వివాదాస్పదంగా మారిన అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ సరఫరా విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకు నడుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల ప్రారంభంలో జరిగిన సమావేశంలో స్టేట్ డిస్కమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందం స్థితిని చర్చించారు. వచ్చే ఏడాది విద్యుత్ సరఫరాను ప్రారంభించాలని నిర్ణయించిన అదానీ గ్రీన్తో SECI విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సంతకం చేసింది. అయితే ఈ కాంట్రాక్టుపై ఎలా ముందుకెళ్లాలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబడలేదని తెలుస్తోంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో అదానీతో గత ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్ట్ను రద్దు చేయాలని నిర్ణయించుకుంటే, అది 25 ఏళ్ల పాటు గణనీయమైన మొత్తాన్ని చెల్లించడం ముగుస్తుంది. దాదాపుగా ఏటా రూ.2,800 కోట్లు. ఇదే క్రమంలో ప్రభుత్వం కొనుగోలు ఒప్పందంతో కొనసాగితే తుది వినియోగదారు, రిటైల్ వినియోగదారులు కొనుగోలు చేసిన విద్యుత్ కోసం అదనంగా 80పైసల నుంచి రూ.1 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు భౌగోళిక నెట్వర్క్ యాక్సెస్ భాగం కూడా దీనికి వర్తిస్తుంది. వాస్తవానికి స్టేట్ డిస్కామ్కు ప్రారంభ 3 GW పునరుత్పాదక శక్తిని, 2025లో మరో 3 GW మరియు 2026లో 1 GW సరఫరా చేయాలనేది అదానీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం.
అయితే ప్రస్తుతం ఏపీలో అదానీ పవర్ డీల్ అధికార-విపక్ష నేతల మధ్య ఆరోపణలకు దారితీసింది. ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా నిరసనలు ప్రారంభించారని ఆరోపించారు. వాస్తవానికి 2019లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే జగన్ సర్కార్ లో జరిగిన అవినీతి, నిర్ణయాలతో ప్రస్తుతం ఏపీ విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో పీపీఏల రద్దు పెద్ద తప్పుడు నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు.
దీని వల్ల ఏపీ దాదాపు 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు. అలాగే డిస్కమ్ల ఆరోగ్యం కూడా క్షీణించిందని అన్నారు. జగన్ హయాంలో విద్యుత్ యూనిట్ కు రూ.5 వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ వారు యూనిట్ 8-14 రూపాయలకు కొనగోలు చేశారని ఇది ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల పేరుతో భారంగా వేశారని అన్నారు. వివిధ సంవత్సరాల్లో వేసిన ఛార్జీల భారాన్ని గమనిస్తే.. 2021-22కి రూ.3,082 కోట్లు, 2022-23కి రూ.6,073 కోట్లు, 2023-24కి రూ.9,412 కోట్లుగా ఇవి ఉన్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications