అమరావతిలో త్వరగా మీ శాఖలు ఏర్పాటు చేసుకోండి.. బ్యాంకులను కోరిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశలో భాగంగా మరో ముఖ్యమైన అడుగు వేశారు. గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని ఒక అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఆయన అనేక ప్రముఖ బ్యాంకుల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లను (ఎండీలు) కలుసుకొన్నారు. ఏపీ రాజధానిలో తమ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు.

మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు మరికొన్ని ప్రధాన బ్యాంకుల అధినేతలు పాల్గొన్నారు. అధికారిక ప్రకటన ప్రకారం.. ముఖ్యమంత్రి నాయుడు వారిని అమరావతిలో తమ ఉనికిని పెంచి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు భాగస్వాములుగా ముందుకు రావాలని కోరారు.

Andhra Pradesh CM AP CM banks request Amaravati regional offices banks banks in Amaravati Andhra Pradesh state projects AP CM banking partnerships Amaravati development banks AP government banking collaboration Andhra Pradesh infrastructure finance banks support AP projects

ఓడరేవులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పరుగులు పెట్టనుంది.అలాగే క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుతో ఆధునిక టెక్నాలజీ, పరిశోధన, ఇన్నోవేషన్‌లకు హబ్‌గా రూపుదిద్దుకోబోతోంది. అమరావతిని ప్రపంచస్థాయి మెట్రో నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టులు అమలులోకి రాగానే ఆర్థిక లావాదేవీలు విస్తృతంగా పెరుగుతాయి.

ఈ పరిస్థితుల్లో బ్యాంకులకు విస్తృత వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కాబట్టి, ఇప్పుడే Amaravati లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించడం ద్వారా వారు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. అమరావతిలో అనేక బ్యాంకులకు కార్యాలయాల కోసం భూమిని ఇప్పటికే ఆఫర్ చేశామని సీఎం గుర్తుచేశారు. గత 15 నెలల్లో రాష్ట్రం భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించిందని, దీనికి బ్యాంకింగ్ రంగం మద్దతు ఉంటే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

రాష్ట్రంలోని పెట్టుబడి ప్రవాహం నిరంతరం పెరుగుతున్నందున, బ్యాంకులు విస్తృత రుణ సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉంది. రైతులు, పరిశ్రమలు, సేవా రంగం, చిన్న వ్యాపారాలు.. ఇలా వీటన్నింటికీ బ్యాంకులు సులభమైన ఆర్థిక సహకారం అందిస్తే, అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. అమరావతిలో కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే, రాష్ట్రంలోని విభిన్న జిల్లాలకు కూడా సమర్థవంతమైన సేవలు అందించవచ్చని సీఎం బ్యాంకులకు సూచించారు.

అమరావతిని ఒక ఆర్థిక, సాంకేతిక మరియు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో, బ్యాంకుల మద్దతు అత్యంత అవసరమని ఆయన హైలైట్ చేశారు. బ్యాంకులు ప్రభుత్వ ప్రాజెక్టులలో భాగస్వామ్యం అయితే, అది రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే కాకుండా, బ్యాంకులకే లాభదాయకంగా మారుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+