ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26 హైలెట్స్: ఏ పథకానికి ఎన్ని నిధులంటే..?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతిలోని అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359.33 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాజిక సంక్షేమ పథకాలు, విద్య, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అండ్ నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు చూస్తే ముందుగా పాఠశాల విద్య ఇంకా అభివృద్ధి కోసం రూ.31,806 కోట్లు కేటాయించింది.

అలాగే పారిశ్రామిక అభివృద్ధి ఇంకా నైపుణ్యాభివృద్ధి కోసం రూ.12,112 కోట్లు కేటాయించారు. సామాజిక సమ్మిళితత్వం & సాధికారత కోసం రూ.1,42,349 కోట్లు, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి రూ.29,655 కోట్లు కేటాయించారు.

ap budget 2025-26 finance minister payyavula keshav allocated funds to schemes and departments and speech highlights

2025-2026 సంవత్సరానికి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ఇంకా హైదరాబాద్‌లలో పారిశ్రామిక కారిడార్‌ల కోసం రూ.837 కోట్లు, పరిశ్రమలు, MSMEలు సహా ఆహార ప్రాసెసింగ్ కోసం రూ.1,400 కోట్లు కేటాయించింది. అలాగే FY26 సంవత్సరానికి రాష్ట్రంలో ఆర్థిక & సాంకేతిక పురోగతి కోసం రూ.55,730 కోట్లు కేటాయించింది.

ప్రభుత్వ హమీలోని తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో రూ 9,407 కోట్లను ప్రతిపాదించారు, అలాగే రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో మే నెలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తేలిపింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 6300 కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయింపు చేసారు. అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా, కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ కలిపి ఈ పథకం అమలు కానుంది.

పెన్షన్ల కోసం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు కేటాయించారు. అదే విధంగా చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్ లో పోర్టులు, ఎయిర్‌పోర్టులకి రూ.605 కోట్లు కేటాయింపులు చేసారు. మత్స్యకార భరోసా కోసం రూ 450 కోట్లను ప్రతిపాదించారు. తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయిస్తూ తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు అలాగే నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం కూడా నిధుల కేటాయింపు చేశారు.

ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,705 కోట్లను, సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లను కేటాయించారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి రూ.61 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.315 కోట్లు, సహకార శాఖకు రూ.239 కోట్లు, వ్యవసాయం యాంత్రీకరణ కోసం రూ.219 కోట్లు, పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.250 కోట్లు, ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.వెయ్యి కోట్లు, ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు, దీపం 2.O కోసం రూ.2,601 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు కేటాయించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+