కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తాజాగా చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా దేశాల నుంచి భారత్కు దిగుమతి చేసుకునే ఆప్టికల్ ఫైబర్పై భారీగా సుంకాన్ని విధించింది. ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎలా జాక్ పాట్ అందించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ నాణ్యత, ధర కలిగిన ఆప్టికల్ ఫైబర్ దిగుమతి కంపెనీలకు సైతం ఆర్థికంగా భారాన్ని మోపుతుంది. ఈ నష్టం నుంచి భారతీయ కంపెనీలను రక్షించడానికి, భారతదేశ వృద్ధికి బలమైన మార్గం వేయడానికి నాసిరకం ఆప్టికల్ ఫైబర్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం విధించటం జరిగింది. ఈ నిర్ణయం దేశీయంగా ఉన్న ఆప్టికల్ ఫైబర్ పరిశ్రమలోని కంపెనీలకు పెద్ద వ్యాపార అవకాశాన్ని అందించనుంది.

నాసిరకం ఉత్పత్తులపై విధించిన పన్ను కారణంగా దేశీయ కంపెనీలైన స్టెరిలైట్ టెక్నాలజీస్, బిర్లా కేబుల్లకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఈ రెండు కంపెనీల షేర్లు సోమవారం భారీగా లాభపడ్డాయి. స్టెరిలైట్ టెక్నాలజీస్ కంపెనీ స్టాక్ 5 శాతానికి పైగా లాభపడగా, బిర్లా కేబుల్స్ స్టాక్ 20 శాతం మేర పెరిగింది. అయితే మంగళవారం మార్కెట్ల ప్రభావంతో కొంత నష్టంలో ట్రేడింగ్ ముగించాయి. అయితే దీర్ఘకాలంలో కంపెనీలకు మంచి ఆర్డర్లు, ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
కేంద్రం తీసుకొచ్చిన యాంటీ డంపింగ్ డ్యూటీ రానున్న ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉండనుంది. అంటే దీర్ఘకాలంలో ఆప్టికల్ ఫైబర్ వ్యాపారంలో ఉండే కంపెనీలు మంచి పనితీరును నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్ద పెట్టుబడి అవకాశమని చెప్పుకోవచ్చు. సరైన కంపెనీని ఎంచుకోవటానికి ఇదే సరైన సమయం. అత్యంత వేగంగా డిజిటలీకరణ వైపుకు అడుగులు వేస్తున్న భారతదేశానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో ఖర్చులను తగ్గించేందుకు కంపెనీలకు తోడ్పడనుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications