mutual funds misconceptions: దేశ ప్రజల్లో పెరిగిన ఆర్థిక అక్షరాస్యతకు నిలువెత్తున నిదర్శనమే మ్యూచువల్ ఫండ్స్లోకి విపరీతంగా పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పవచ్చు. సాంప్రదాయ పెట్టుబడి సాధనాలను వదిలిపెట్టి హై-రిటర్న్స్ ఇచ్చే వాటి వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అయితే రిటర్నులతో పాటు అదే స్థాయిలో రిస్క్ ఉంటుందనే విషయాన్ని విస్మరిస్తున్నారు. దీనిని తగ్గించుకునేందుకు నిపుణులు సూచిస్తున్న డైవర్సిఫికేషన్ ను ఫాలో అయితే కొంత మేరకు సత్ఫలితాలను ఇస్తుంది.
కానీ ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్ లపై సరైన అవగాహన లేకపోవడంతో వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు భయపడే వారు కూడా ఎందరో ఉన్నారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ దివాళా తీస్తే తమ పరిస్థితి ఏమిటి అన్నది వారిలో ప్రముఖ ఆందోళనగా కనిపిస్తోంది. దీనికి కారణం వారికి ఆర్థిక మార్కెట్ల నిర్వహణ గురించిన అవగాహనా రాహిత్యమేనని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లు ఆర్థిక మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తాయి. ప్రతి ఫండ్ హౌస్ దాని నియమ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ దివాళా తీయడం, పెట్టుబడిదారుల నగదు తీసుకొని పారిపోవడం వంటివి చేయడం కుదరదు. ఓ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడిని పెట్టిన వెంటనే సదరు ఫండ్ హౌస్ కస్టమర్ పేరిట స్టాక్స్ కొనుగోలు చేసి తనుగుణంగా పోర్ట్ఫోలియోకు యాడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ డబ్బు అటు ఫండ్ మేనేజర్ లేదా ఫండ్ హౌస్ చేతిలో ఉండదు. అది పూర్తిగా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. దీంతో ఆయా స్టాక్స్ విలువ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రిటర్నులు పెరగడం, అవి తగ్గినప్పుడు తగ్గడం జరుగుతూ ఉంటాయి.
ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఓ ఇన్వెస్టర్ పెట్టుబడి పెడుతున్న ఫండ్ లేదా ఫండ్ హౌస్ దివాళా తీసే పక్షంలో సెబీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల సంపద ఏమాత్రం నష్టపోకుండా వారికి సెటిల్ చేసిన తర్వాతే ఈ విభాగం నుంచి బయటికి వెళ్ళవచ్చు. వేరే ఏదైనా కంపెనీ టేక్ ఓవర్ చేసిన పక్షంలో లేదా పూర్తిగా ఫండ్ హౌస్ బిజినెస్ నుంచి తప్పుకుంటుంటే తమ స్టాక్ హోల్డింగ్ను మార్కెట్లో విక్రయించి సదరు అమౌంట్ను కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మ్యూచువల్ ఫండ్ హౌస్ లు దివాళా తీయడం వల్ల పెట్టుబడిదారులు నష్టపోవడం అనేది జరగే అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications