Paytm COO: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(PPBL)పై రిజర్వ్ బ్యాంక్ చర్యల తర్వాత కంపెనీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. టాప్ లెవల్ మేనేజ్మెంట్ లోని పలువురు సంస్థను వీడారు. కేవలం PPBL మాత్రమే కాకుండా దాని ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా సీనియర్స్ బయటకు క్యూకట్టారు. గత రెండు రోజుల క్రితమే పేటీఎం మనీ CEO వరుణ్ శ్రీధర్ రాజీనామా చేశారు. కాగా ఇప్పుడు మరొకరు సంస్థకు దూరమయ్యారు.
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) భవేష్ గుప్తా కంపెనీకి రాజీనామా చేసినట్లు సంస్థ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన పేటీఎంలోని లోన్స్, ఆన్లైన్ /ఆఫ్లైన్ చెల్లింపులు మరియు కంప్లయన్స్ విభాగాలకు బాధ్యత వహించేవారు. కొత్త లావాదేవీలను కొనసాగించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై RBI నిషేధం విధించడం వల్ల ఆయన నేతృత్వంలోని వర్టికల్స్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

'పేమెంట్స్ మరియు లోన్స్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భవేష్ గుప్తా వ్యక్తిగత కారణాల వల్ల కెరీర్లో విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన అడ్వైజరీ రోల్కి మారనున్నారు. ఈ ఏడాది చివరి వరకు సంస్థ వృద్ధి పథంలో పలు కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేస్తారు' అని పేటీఎం ప్రకటించింది.
'భవేష్ అందించిన సహకారానికి, సంస్థ ఆపరేషన్స్ సజావుగా సాగేలా చేయడంలో ఆయన పాత్రకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెల్లింపులు మరియు రుణాలపై గతంలో కంటే ఇప్పుడు మా దృష్టి బలంగా ఉంది. మా ప్రణాళికలను అమలు చేయడానికి మా ప్రతి వ్యాపారంలో ఉన్న అనుభవజ్ఞులైన నాయకులతో నేను కలిసి పనిచేస్తాను' అని పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
గుప్తా క్లిక్స్ క్యాపిటల్ (గతంలో GE క్యాపిటల్) నుంచి ఆగస్టు 2020లో పేటీఎంలో చేరారు. కాగా మే 31న కంపెనీ సేవల నుంచి రిలీవ్ కానున్నారు. నాయకత్వ నిర్మాణ మార్పుల్లో భాగంగా పేటీఎం మనీ CEOగా రాకేష్ సింగ్ నియమితులయ్యారు. గతంలో ఉన్న వరుణ్ శ్రీధర్ స్థానంలో రాకేష్ను సంస్థ కొత్తగా అపాయింట్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications