Banking News: ఆ కాలంలో బ్రిటీష్ వారు దేశ సంపదను కొల్లగొట్టారు. పేరు వేరైనా ఇప్పుడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు దాదాపు అదే పని చేశారు. అందినకాడికి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎంచక్కా విదేశాలు చెక్కేశారు. ఇప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో రోజూ చూస్తూ కూడా మనం ఏమీ చేయలేకపోవడం శోచనీయం.
కాగా విజయ్ మాల్యా కేసుకు సంబంధించి ముంబైకి చెందిన CBI ప్రత్యేక కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్(NBW) జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కి 180 కోట్ల రుణం ఎగవేసి పరారీలో ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. CBI సమర్పించిన వివరాలు, మాల్యా పరారీని పరిగణలోనికి తీసుకుని ఓపెన్-ఎండెడ్ NBW రిలీజ్కి తగిన కేసుగా న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం అటకెక్కిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ చెల్లింపులపై కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ చేయడం ద్వారా బ్యాంకుకు 180 కోట్లకు పైగా నష్టం కలిగించారని CBI ఆరోపించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేసిన మనీలాండరింగ్ కేసులో కూడా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా మాల్యాను ప్రకటించింది. ప్రస్తుతం లండన్లో నివసిస్తుండగా, ఆయనను తరిగి అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతోంది.
2007-2012 మధ్య IOB నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పొందిన రుణాలను దారి మళ్లించారని CBI ఆరోపిస్తోంది. ఈ చీటింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే వారెంట్ జారీ చేసింది. ఇతర కేసుల్లోనూ మాల్యాపై NBWలు ఉండటంతో సమన్లు జారీ చేసినా ప్రయోజనం ఉండదని కోర్టు భావించింది. మనీలాండరింగ్తో పాటు ఆరోపణలు కూడా ఉండటంతో PMLA కింద ప్రత్యేక న్యాయస్థానం కూడా విచారణ జరిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications