Hyderabad News: మరోసారి వార్తల్లోకి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌.. డైరీ మిల్క్ ఘటన మరువక ముందే మరోసారి..

Dairy Milk: పిల్లలు మొదలు పెద్దల వరకు చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. 'తియ్యని వేడుక చేసుకుందాం' అంటూ భారతీయుల మదిని తాకిన చాక్లెట్ బ్రాండ్ క్యాడ్‌బరీ డైరీ మిల్క్. కానీ ఇటీవల ఆ ఉత్పత్తిపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆహార భద్రత విభాగం సైతం రంగంలోకి దిగి, పరీక్షలు నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ బ్రాండ్ ప్రతిష్ఠకు డ్యామేజ్ ఏర్పడింది.

ఇది జరిగి సరిగ్గా మూడు నెలలు కాకముందే మరోసారి డైరీ మిల్క్ చాక్లెట్ పై సోషల్ మీడియాలో ఫిర్యాదు దర్శనమిచ్చింది. అయితే ఈసారి చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు షేర్ చేశారు. గతంలో ఘటన చోటుచేసుకున్న హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోనే మరోసారి ఇలా జరగడంతో సదరు సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Another complaint againt Cadbury dairy milk from Ameerpet Metro Station

'హైదరాబాదీ పిల్లా' అనే ఖాతా ద్వారా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. అమీర్‌ పేట మెట్రోస్టేషన్‌ లో డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేసి, తీరా తిందామని ఓపెన్ చేసే సమయానికి అందులో బూజు కనిపించినట్లు నెటిజన్ చెప్పుకొచ్చారు. చాక్లెట్ తయారీ తేదీ జనవరి 2024 కాగా 12 నెలల వరకు ఎక్స్‌పైరీ డేట్ ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌ కావడంతో పలువురు సామాజిక మాధ్యమ యూజర్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెట్రో స్టేషన్‌లో షాపుతో పాటు క్యాడ్‌బరీ సంస్థపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ఘటనపై ఫుడ్ సెఫ్టీ అధికారులు స్పందించాల్సి ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+