Data hack: ఓ పక్కన పెరుగుతున్న సాంకేతికతను చూసి గర్వపడాలో, దానితో పాటే ఉత్పన్నమవుతున్న సమస్యలను చూసి బాధ పడాలో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ వల్ల మానవ జీవన ప్రమాణాలను మెరుగుపడుతుండగా.. అదే సాంకేతికతతో అందిన కాడికి దోచుకునేందుకు దుండగులు సైతం రెడీ అయ్యారు. సైబర్ అటాక్లు, హ్యాకింగ్స్తో సున్నితమైన ఆర్థిక, వ్యక్తిగత డేటాను చోరిచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఏంజెల్ వన్ డేటా లీక్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 8 మిలియన్ల కస్టమర్లు దీని ద్వారా ప్రభావితమైనట్లు వార్తలు వచ్చాయి. ఒక వెబ్సైట్లో బాధిత వినియోగదారుల పేర్లు మరియు చిరునామాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ లీక్ చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. సదరు కస్టమర్ల లాభనష్టాల ప్రకటనలతో కూడిన సున్నితమైన డేటాను అజ్ఞాత వ్యక్తి యాక్సెస్ చేసినట్లు పేర్కొంది. ఈ డేటా 2023 నాటిదని ఓ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ చెప్పినట్లు వెల్లడించింది.

ఈ నివేదికపై ఏంజెల్ వన్ స్పందించింది. కస్టమర్ డేటా సురక్షితంగా ఉందని, కొత్తగా ఎటువంటి డేటా లీక్ జరగలేదని తెలిపింది. ప్రస్తుత సమస్య ఏప్రిల్ 2023లో జరిగిన సంఘటనకు సంబంధించినది కాగా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దీని వల్ల క్లయింట్ సెక్యూరిటీలు, ఫండ్స్, లాగిన్ సమాచారంపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. తమవద్ద అన్ని క్లయింట్ ఖాతాలు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చింది.
గత ఏడాది ఏప్రిల్లో ఏంజెల్ వన్ డేటా ఉల్లంఘనకు గురైంది. అయితే ప్రభావితమైన కస్టమర్ల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. ప్రభావితమైన వినియోగదారుల పేర్లు, మొబైల్ నంబర్లు మరియు ఇమెయిల్ చిరునామాలు మాత్రమే లీక్ అయినట్లు పేర్కొంది. నిధులు మరియు సెక్యూరిటీలకు సంబంధించిన సమాచారం సురక్షితంగా ఉందని భరోసా ఇస్తున్నట్లు అప్పట్లో వివరించింది.
భారత్లో ఒక్క 2023లోనే ఒక్కో సంస్థ వారానికి దాదాపు 2 వేల 138 దాడులను ఎదుర్కొన్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ తెలిపింది. సిస్కో 2024 సైబర్సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ కూడా కేవలం 4 శాతం భారతీయ సంస్థలు మాత్రమే సైబర్ సెక్యూరిటీ ప్రమాదాలను ఎదుర్కోవడానికి రెడీ ఉన్నట్లు వెల్లడించింది. మరో 37 శాతం తమ ఇందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా 3 శాతం మాత్రమే సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications