భారీ నష్టాల్లో తెలంగాణ, ఏపీలోని విమానాశ్రయాలు, లాస్ విలువ రూ.1,861 కోట్లకు పైమాటే ..ఇంకో షాక్ న్యూస్ ఏంటంటే..

Telugu States airports suffer massive losses: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహిస్తున్న ఏడు విమానాశ్రయాలు గత దశాబ్దంలో భారీ ఆర్థిక నష్టాలను చవిచూశాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో పౌర విమానయాన శాఖ అందించిన తాజా సమాచార ప్రకారం.. ఏపీ, తెలంగాణలోని బేగంపేట, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి తదితర ఏడువిమానాశ్రయాలు కలిపి గత 10 ఏళ్లలో మొత్తం రూ.1,861 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయని తెలిపింది. అంటే సగటున ప్రతి సంవత్సరం రూ.150 కోట్లకు పైగా నష్టం ఈ విమానాశ్రయాలు నడపడం ద్వారా వాటిల్లుతోంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పనిచేయని వరంగల్ విమానాశ్రయం కూడా 2015-16 నుంచి రూ.5 కోట్ల వరకు నష్టాలని నమోదు చేసిందని రాజ్యసభలో పౌర విమానయాన శాఖ తెలిపింది . అదే సమయంలో బేగంపేట విమానాశ్రయం ఒక్కటే దాదాపు రూ.564.97 కోట్లు నష్టాలను నమోదు చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ (రూ.673.91 కోట్లు), అగర్తల (రూ.605.23 కోట్లు) తర్వాత మూడవ అత్యధిక నష్టపోయిన విమానాశ్రయంగా నిలిచిందని ప్రభుత్వ నివేదిక తెలిపింది. మొత్తంగా చూసుకున్నట్లయితే.. AAI నిర్వహిస్తున్న 81 విమానాశ్రయాల్లో గత దశాబ్దంలో రూ.10,000 కోట్లకు పైగా నష్టాలు నమోదయ్యాయి.

2008లో బేగంపేట విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను RGIA (శంషాబాద్) ప్రారంభమైన తర్వాత AAI నిలిపివేసింది. అప్పటి నుంచి ఇది సాధారణ విమానయాన, సైనిక విమానాలకు మాత్రమే సేవలు అందిస్తోంది. ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో 2012-13 నుంచి 2014-15 మధ్య కాలంలోనే AAI అక్కడ రూ.84.16 కోట్ల కార్యాచరణ నష్టాన్ని నివేదించింది.

Andhra Pradesh airport losses Telangana airports financial loss regional airports deficit 1 861 crore loss report AP airports operating loss Telugu states aviation sector loss making airports regional connectivity India 10 AAI airports suffer massive losses

పరిశీలనలో ఉన్న మరికొన్ని విమానాశ్రయాలులో వాణిజ్య విమానాల రాకపోకలు లేకపోవడంతో మెయింటెనెన్స్ చేయాల్సి రావడంతో నష్టాలు వస్తున్నాయి. కొన్నింటిలో కేవలం VIP విమానాలే ల్యాండింగ్ అవుతున్నాయి. ఈ విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటమే కాక.. నాన్-ఏరోనాటికల్ ఆదాయ వనరులు (ఆడ్స్, షాప్స్, పార్కింగ్ మొదలైనవి) కూడా చాలా పరిమితంగా ఉండటంతో ఆదాయం కనపడకపోగా నష్టం ఎక్కువగా పెరుగుతోంది.

విమానాశ్రయాల నిర్వహణలో రన్‌వే మెయింటెనెన్స్, అగ్నిమాపక చర్యలు, భవన నిర్వహణ, సిబ్బంది జీతాలు వంటి వాటికి భారీగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఈ ఖర్చులన్నీ నేరుగా నష్టాల కింద మారుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అధ్యక్షుడు కెప్టెన్ సి.ఎస్. రాంధవా తెలిపారు.ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే.. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయాలన్నారు. అలాగే టైర్-II, టైర్-III నగరాలతో వీటిని అనుసంధానించాలని కోరారు. అందుబాటులో ఉన్న విమానాశ్రయాలను పునరుద్ధరించి సాధ్యమైనంత వరకూ వాణిజ్య కార్యకలాపాలు పెంచాలని ఆయన చెబుతున్నారు.

ఇదిలా ఉంటే AAI ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని వరంగల్ విమానాశ్రయంపై పలుమారు భూమిని అప్పగించాలని కోరింది. ఇప్పుడున్న దానికి అదనంగా మరో 253 ఎకరాల భూమి అప్పగించాల్సిందిగా కోరింది. ప్రస్తుతం కలిగిన 700 ఎకరాలతో మాస్టర్ ప్లాన్ రెడీ చేసినప్పటికీ, విస్తరణకు కావాల్సిన భూమిని ఇంకా ప్రభుత్వం AAIకి అప్పగించలేదు. భూమి అందుబాటులోకి వచ్చిన వెంటనే విమానాశ్రయ ప్రయోజనాల కోసం పూర్తిస్థాయి అభివృద్ధి చేపట్టబడుతుందని అధికారులు పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+