దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ వన్‌గా ఏపీ.. ఫోర్బ్స్ ఇండియా కథనంపై నారా లోకేశ్ స్పందన ఇదే..

పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక చరిత్రలోనే ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25.3 శాతం వాటాను సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించినట్లుగా ఫోర్బ్స్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఏపీ ముందుకు రావడం దేశ పారిశ్రామిక గమనంలో పెద్ద మార్పును సూచిస్తోందని నివేదక తెలిపింది.

ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం అధికం. ఈ పెట్టుబడుల్లో సగానికి మించిన వాటా అంటే 51.2 శాతం కేవలం మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. అందులో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా..ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

Andhra Pradesh investment AP investment magnet India investment FY26 proposed investments India FY26 investment announcements Andhra Pradesh industrial growth investment shift east India investment shift south India Odisha investment share Maharashtra investment share India industrial corridor eastern corridor investment southern corridor investment capital expenditure India investment pipeline FY26 India investment data state-wise investments India AP economic growth India business news industrial momentum India FY26 FY26

ఈ అద్భుత విజయంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఇక ఇతర రాష్ట్రాలను అందుకోవడం కాదు, వారిని దాటి ముందుకు దూసుకుపోతోంది. సంస్కరణల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో వేగం, పెట్టుబడిదారులకు స్పష్టమైన భరోసా ఇవ్వడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా, విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారుల స్నేహపూర్వక పాలన, అనుమతుల ప్రక్రియలో వేగం, రంగాల వారీగా ప్రత్యేక విధానాలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓడరేవుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్, విద్యుత్, డిజిటల్ మౌలిక వసతులపై ప్రభుత్వం పెట్టిన దృష్టి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలపరిచింది. తయారీ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, మౌలిక వసతుల రంగాల్లో దేశీయంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులు భారీగా ఏపీ వైపు తరలివస్తున్నాయి. పెట్టుబడిదారులతో ప్రభుత్వం నిరంతరం నిర్వహిస్తున్న చర్చలు, స్పష్టమైన విధాన దిశ, పాలనలో పారదర్శకత ఈ ప్రవాహానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయి.

ఏదేమైనా వచ్చే ప్రతి పెట్టుబడి కేవలం గణాంకంగా కాకుండా, క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, ప్రజలకు ఆదాయ అవకాశాలుగా మారాలి. దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, యువతకు ఉపాధి కల్పన మా ప్రాధాన్యం అని నారా లోకేశ్ మరోసారి తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+