Andhra Pradesh: పోర్టు ఆధారిత వృద్ధిపై ఏపీ ఫోకస్.. తీరప్రాంత అభివృద్ధికి మెగా ప్లాన్..

AP Development: తీరప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అయితే దీని అభివృద్ధికి మెగా ప్లాన్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. తీరప్రాంతాలను వ్యాపార హబ్‌లుగా తీర్చిదిద్దుతూ ఏపీ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

పోర్టుల కేంద్రంగా అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కొత్త ఓడరేవుల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తోంది. వీటిలో నిర్మాణ పనులు వేగం పుంజుకోవటంతో పాటు ఇప్పటికే ఉన్న 6 ఓడరేవుల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ తన సముద్ర లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ డేటా ప్రకారం గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కృష్ణపట్నం, రవ్వ, కాకినాడ ప్రధాన నౌకాశ్రయం, విశాఖ ఓడరేవులు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 189.21 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేశాయి. ఇది ఏడాది కిందట నమోదైన 175.206 మిలియన టన్నుల కంటే అధికం కావటం గమనార్హం.

Andhra Pradesh Government focusing on Port lead growth amid constructing 4 new ports

ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్‌తో కలిసి పోర్ట్ ఆధారిత ఆర్థిక వృద్ధికి పెట్టుబడి పెడుతోంది. ఇందులో భాగమైన నాలుగు కొత్త పోర్టులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. రూ.2,123 కోట్లతో కాకినాడ SEZ పోర్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పని జరుగుతోంది. డ్రెడ్జింగ్, బ్రేక్‌వాటర్ రివిట్‌మెంట్, బెర్త్‌ల నిర్మాణం, పోర్ట్ భవనాలు, రోడ్లు, రైల్వే లైన్, పోర్ట్ క్రాఫ్ట్ బెర్త్ వంటి ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయబడిన స్పెషల్ పర్పస్ వెహికల్ కొనసాగిస్తోంది. అలాగే నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు 'భూస్వాముల నమూనా' కింద అభివృద్ధి చేయబడుతోంది. రూ.3,736 కోట్ల వ్యయంతో రామాయపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రానున్న కాలంలో వీటిని ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇస్తుంది.

పెట్రేగాజ్ ఇండియా కృష్ణపట్నంలో రూ.600 కోట్ల ఎల్‌పీజీ దిగుమతి & నిల్వ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాగే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ FY25లో 90 మిలియన్ టన్నుల కార్గో ట్రాఫిక్ సాధించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పారిశ్రామిక కార్గో తరలింపు కోసం జలమార్గాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. కృష్ణా జిల్లాలో రూ.5,155 కోట్లతో మచిలీపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, శ్రీకాకుళం జిల్లాలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మొదటి దశ పనులు కూడా 'ల్యాండ్‌లార్డ్ మోడల్' కింద కొనసాగుతున్నాయి.

సాగర్‌మాల ప్రాజెక్ట్ కింద కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లో అభివృద్ధి పనులు రూ.91 కోట్లతో జరుగుతున్నాయి. అలాగే తీరప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఫేజ్ I కింద రూ.1,523 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్‌లను, ఫేజ్ II కింద రూ.1,595 కోట్లతో ఆరు ఫిషింగ్ హార్బర్‌లను నిర్మించేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్‌ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు కూడా రూ.127 కోట్ల వ్యయంతో నిర్మించబడతాయని వెల్లడైంది. వీటికి తోడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో స్మార్ట్ పోర్ట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది పోర్ట్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+