ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. సీఎం జగన్ చొరవతో 3 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్..
Andhra Pradesh: 2019 నుంచి పెట్టుబడులను ఆకర్షించటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది.
2022-23లో ప్రభుత్వం 3,32,186 కోట్లను ఆకర్షించినట్లు ఎంఎస్ఎంఈ ఎగుమతి ప్రోత్సాహక మండలి, సేంద్రీయ ఆహారోత్పత్తులు, మార్కెటింగ్ ఏజెన్సీల సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2019 నుంచి ఏపీ ప్రభుత్వ ప్రైవేటు రంగాల నుంచి రూ.9,41,020 కోట్లను ఆకర్షించిందని MSME ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రావత్ వెల్లడించారు. ఈ క్రమంలో రూ.1,34,419 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులు పూర్తయ్యాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డేటా వెల్లడించింది.

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల విలువ రూ.27,110 కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టులు పునరుద్ధరించబడ్డాయని వెల్లడైంది. 2022-23లో మొత్తం పెట్టుబడి ప్రాజెక్టుల విలువ 17,90,533 కోట్లు కాగా, అమలులో ఉన్న ప్రాజెక్టుల విలువ 7,51,980 కోట్లని వెల్లడైంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు 23,293 కోట్లు, ప్రైవేట్ రంగం రూ.3,08,893 కోట్లుగా నివేదించబడింది. ప్రభుత్వ ప్రాజెక్టుల కింద 2022-23లో మొత్తం పెట్టుబడి ప్రాజెక్టులు రూ.10,65,526 కోట్లు, అమలులో రూ.5,64,868 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 61,000 ఎంఎస్ఎంఈలు, 5.80 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడైంది. 2022-23లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ.52 కోట్ల విరాళాలను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందుకుంది. ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ నేతృత్వంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సమయంలో అత్యధికంగా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకట్టుకోగలిగింది. పారదర్శకత, వనరుల లభ్యత, వేగవంతమైన అనుమతులు, ప్రత్యేక ప్రభుత్వ విండోతో పాటు ప్రత్యేక బృందం పర్యవేక్షణను అందించటం వల్ల ఇన్వెస్టర్లు ఏపీలో తమ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చారు.


Click it and Unblock the Notifications