మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నవంబర్ వరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉండేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని కంపెనీ తెలిపింది. ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మరో ఏడాది (2021 నవంబర్) వరకు ఉండాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ప్రతిపాదనకు షేర్ హోల్డర్లు అంగీకరించారని పేర్కొన్నది. దీంతో బీఎస్ఈ ఫైలింగ్ కూడా చేసినట్టు కంపెనీ శనివారం మీడియాకు వివరించింది.
వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 1 వరకు ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉండే వెసులుబాటు ఉంది. సెక్యూరిటీ ఎక్స్చెంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు అప్పటి వరకే అనుమతి ఉంది. కానీ గవర్నెన్స్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ, బోర్డ్ అభీష్టం మేరకు తన పదవీ కాలం పొడిగింపునకు ఆనంద్ మహీంద్రా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గడువు పెంపునకు సంబంధించిన ప్రక్రియను పవన్ గొయెంకా, అనీష్ షా పరిశీలిస్తున్నారని ఆనంద్ మహీంద్రా కంపెనీ పేర్కొన్నది. కంపెనీ యాక్ట్ ప్రకారం 2022 ఏప్రిల్ 17 వరకు ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేసే అవకాశం ఉంది. దానిని కంపెనీ 2020 ఏప్రిల్ 1కి సవరించేందుకు అంగీకరించారు. కానీ ఇప్పుడు మరో ఏడాది పెంచుతున్నామని, ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల అభీష్టం మేరకు మార్చుతున్నామని చెబుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications