Anand Mahindra: ఇజ్రాయెల్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. భారత్‌ కూడా అలా చేయాలని సూచన

Mahindra Tweet: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయా సామాజిక సమస్యలు, స్ఫూర్తిదాయక వ్యక్తులు సహా వివిధ విషయాలపై నిరంతరం స్పందిస్తుంటారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ప్రస్తతం భారత్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏప్రిల్ 13న డ్రోన్లు మరియు క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. వాటిలో మెజారిటీ క్షిపణులను పడగొట్టడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాన్ని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇక్కడ వారు వినియోగించిన వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తే బావుంటుందని భారత ప్రభుత్వాన్ని కోరారు.

Anand Mahindra praised Israel s defence system and suggested India to have such technology

'ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌ను మించిన సాంకేతను కలిగి ఉంది. డేవిడ్ స్లింగ్ అనే సుదూర ఇంటర్‌సెప్షన్ వ్యవస్థ వారు కలిగి ఉన్నారు. లేజర్ టెక్నాలజీతో కూడిన బాణం 2 మరియు 3 సిస్టమ్‌లు కూడా వారి వద్ద ఉన్నాయి. అయితే ఐరన్‌క్లాడ్ డిఫెన్స్ ఇంటర్‌సెప్షన్ వంటి సిస్టమ్‌లను కలిగి ఉండటం భారత దేశానికి కూడా అవసరం. దీనిపై దృష్టి పెట్టి, ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది' అని ఆయన Xలో పోస్ట్ చేశారు.

మహీంద్రా పోస్టులపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. భారత్ కు ఈ తరహా టెక్నాలజీ అవసరమని భావిస్తున్నారు. మనచుట్టూ జరుగుతున్న పరిణామాల నుంచి ఇండియా చాలా నేర్చుకోవాలని ఆశిస్తున్నారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులను పెంచుకుంటూ భవిష్యత్ యుద్ధాలకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని కోరుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+