Anand Mahindra: భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి మహీంద్రా గ్రూప్. దీని ఛైర్మన్ ఆనంద మహీంద్రా, అతని కుటుంబం హైదరాబాద్లో ఉన్న మహీంద్రా విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.
తాజాగా ఆనంద్ మహీంద్రాతో పాటు ఆయన కుటుంబం సుమారు 4,000 మంది విద్యార్థులు ఉన్న హైదరాబాద్ క్యాంపస్ కోసం రూ.500 కోట్లు విరాళంగా అందించాలని ప్రతిజ్ఞ చేశారు. రూ.500 కోట్ల నిధిని రానున్న ఐదేళ్లలో అంటే 2025 నుంచి 2029 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ కీలక ప్రాజెక్టుల కోసం యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టనున్నారు. ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీలో కొత్త కోర్సులను జోడించడం ప్రారంభించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చే పనిలో నిమగ్నమయ్యారు.

మహీంద్రా యూనివర్శిటీలో భాగమైన ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం మహీంద్రా గ్రూప్ చైర్మన్ వ్యక్తిగతంగా రూ.50 కోట్లను అందించటానికి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇందిరా మహీంద్రా అనే ఉపాధ్యాయుడు ఆనంద మహీంద్రా తల్లి.
ఇందిరా మహీంద్రా పేరు పెట్టబడిన ఈ పాఠశాల అకడమిక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ రంగాల్లో రాణించటానికి కృషి చేస్తుంది. తాజా నిధుల జోడింపు చొరవ యూనివర్సిటీ మెుత్తం నాణ్యతను మెరుగుపరుస్తుందని, అవసరమైన అధ్యాపకుల నియామకం, సౌకర్యాలకు ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించినట్లు మహీంద్రా తెలిపారు.
మహీంద్రా విశ్వవిద్యాలయం టెక్ మహీంద్రా మాజీ వైస్ ప్రెసిడెంట్ వినీత్ నాయర్ చొరవతో మే 2020లో స్థాపించబడింది. విశ్వవిద్యాలయం ప్రస్తుతం నాలుగు కేంద్రాల ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయిలో 35 కోర్సులను అందిస్తోంది. అలాగే మహీంద్రా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కింద ఐదు పాఠశాలలు నడుస్తున్నాయి. 2024-25లో స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్తో సహా రెండు అదనపు కళాశాలలు స్థాపించబడతాయి. మహీంద్రా విశ్వవిద్యాలయంలో 4,100 కంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు.


Click it and Unblock the Notifications