కరోనా నుండి గట్టెక్కనివ్వండి: WHO హెచ్చరికపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. తమను మళ్లీ నిరాశకు గురిచేయవద్దని ఆ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి చివరిది కాదని, తర్వాత ఉపద్రవానికి మానవజాతి సిద్ధంగా ఉండాలని WHO చీఫ్ హెచ్చరించారు. దీనిపై ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు.

మళ్లీ నిరాశకు గురి చేసేముందు, ప్రస్తుత మహమ్మారి సంక్షోభం నుంచి అందరం బయటపడనీయండి అని పేర్కొన్నారు. మమ్మల్ని మరింత భయాందోళనకు గురి చేయవద్దన్నారు. కరోనా మహమ్మారి నుండి ఇంకా కోలుకోకముందే మమ్మల్ని అందర్నీ మళ్లీ డిప్రెషన్‍‌లోకి ముంచవద్దన్నారు. మరోసారి నిరాశకు గురిచేసే ముందు కనీసం ఈ మహమ్మారి నుండి బయటపడనీయరా అన్నారు.

Anand Mahindra does not want WHO chief to do this

ఆనంద్ మహీంద్రా ట్వీట్ పైన నెటిజన్లు కూడా చమత్కారంగా స్పందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి WHO సరైన పరిష్కారాలను అందించాలని కూడా నెటిజన్లు సూచించారు. WHO ఈ మహమ్మారితో సరదాగా గడుపుతున్నట్లుగా ఉందని, కానీ తీరు నిరాశపరుస్తోందని నెటిజన్లు పేర్కొన్నారు. కరోనా విషయంలో టెడ్రోస్ అధ్యక్ష ప్రసంగాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+