77 ఏళ్ల చరిత్రతో అమూల్ అద్భుతం: రోజుకు 150 లక్షల లీటర్లతో.. 80 వేల కోట్లు..

త్రిభువన్ దాస్ పటేల్ స్టోరీ: హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మాట్లాడుతున్నప్పుడు, తన ప్రసంగంలో పదే పదే ఒక పేరును ప్రస్తావించారు. ఆయన ఆ పేరును ప్రస్తావించడమే కాకుండా, అతని పేరు పై యూనివర్సిటీ బిల్లును కూడా ప్రవేశపెట్టారు.ఆ పేరు ఎవరిదీ, ఎందుకు లోక్ సభలో ప్రస్తావించారు అని మీకు ఆశ్చర్యం కలిగించిన ఇందుకు పెద్ద స్టోరీ ఉంది.

amul success story 77 years ago this man started Amul now it sells 150 lakh liters of milk daily its turnover is 80 thousand crores

ఆ పేరు ఎవరిదో కాదు త్రిభువన్ దాస్ పటేల్, ఆయన పేరు మీద యూనివర్సిటీ స్థాపించడానికి నిన్న లోక్ సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టబడింది. హోంమంత్రి అమిత్ షా స్వయంగా లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లులో జాతీయ సహకార విశ్వవిద్యాలయానికి త్రిభువన్ దాస్ అని పేరు సిఫార్సు చేసారు. ఈ పేరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి, ఆ తర్వాత అమిత్ షా ఈ సహకార విశ్వవిద్యాలయానికి త్రిభువన్ దాస్ సహకార విశ్వవిద్యాలయం అని ఎందుకు పేరు పెట్టారో వివరించారు. అసలు త్రిభువన్‌దాస్ కిషిభాయ్ పటేల్ ఎవరు, అతని పేరు ఎందుకు అంతలా చర్చించబడింది, అతని పేరుతో ఎందుకు విశ్వవిద్యాలయం ప్రారంభించబడుతోంది? అతనికి పాల ఉత్పత్తి సంస్థ అమూల్ తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా.....

1940 నాటి ఆ కాలం రైతులకు, పశువుల పెంపకందారులకు అత్యంత దారుణమైన కాలం. ఒకవైపు బ్రిటిష్ కంపెనీ పోల్సన్ (polson) గుజరాత్‌లోని రైతుల నుండి అతి తక్కువ ధరలకు పాలను కొనుగోలు చేస్తూ నచ్చినట్లు చేస్తుండగా, మరోవైపు మధ్యవర్తులు లాభాలు ఆర్జిస్తుండేవారు. నిస్సహాయంగా, పశువుల కాపరులు రైతు నాయకుడు త్రిభువన్ దాస్ పటేల్‌ను కలిశారు. రైతుల సమస్యలతో ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కలిశారు. ఆ సమస్యను పరిష్కరించడానికి అతను మొరార్జీ దేశాయ్‌ను గుజరాత్‌కు పంపారు. దీని తరువాత, 1946లో, అహ్మదాబాద్ సమీపంలోని ఆనంద్‌లో ఖేడా జిల్లా సహకార సంఘం ఏర్పడింది తరువాత ఇక్కడి నుండి అమూల్ ప్రయాణం ప్రారంభమైంది.

గ్రామాల నుండి ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తు: 1946లో త్రిభువన్ దాస్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో ఖేడా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని స్థాపించారు. మొదట్లో అమూల్ కేవలం 247 లీటర్ల పాలతో రెండు గ్రామాల నుండి ప్రారంభమైంది. ఉత్పత్తిని విస్తరించడానికి అతను డాక్టర్ వర్గీస్ కురియన్‌ను కలుపుకొని ఇంకా అతనికి సాంకేతిక అలాగే మార్కెటింగ్ బాధ్యతలను అప్పగించాడు. అతను పాలు అండ్ దాని కొవ్వును బట్టి పాల ధరను నిర్ణయించారు. రెండు గ్రామాల రైతులతో ప్రారంభమైన అమూల్ రెండేళ్లలోనే 432 గ్రామాలకు చేరుకుంది.

అమూల్ కు ఆ పేరు ఎలా వచ్చింది: త్రిభువన్ దాస్ పటేల్ అండ్ డాక్టర్ కురియన్‌ వర్గీస్ కలిసి సహకార సంఘానికి ప్రజల భాషల్లో సులభంగా పేరు వచ్చేలా ఒక పేరు పెట్టాలనుకున్నారు. అతనితో కలిసి పనిచేసే రైతులు అమూల్య అనే పేరును సూచించారు. తరువాత ఈ అమూల్యమైన వస్తువు అమూల్ గా మారింది. అమూల్ అసలు పూర్తి రూపం ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. దింతో అమూల్ ప్రయాణం మొదలైంది. కానీ అతని ముందున్న అతిపెద్ద సవాలు పోల్సన్ డెయిరీ.

అమూల్ అమ్మాయి పుట్టింది : నిజానికి పోల్సన్ బ్రాండ్ 1960లలో చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని అధిగమించడానికి అమూల్ ప్రకటనలను ఆశ్రయించాల్సి వచ్చింది. అతను సిల్వెస్టర్ డి'కున్హా సహాయంతో ప్రకటన కోసం అమూల్ గర్ల్‌ను రూపొందించాడు. తరువాత అమూల్ అసలైన డెలీషియస్ ప్రకటన ఎంత ప్రజాదరణ పొందిందంటే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ ప్రకటన ప్రజల పెదవులపై చాల కాలం పాటు నానింది.

247 లీటర్ల నుండి 2.63 కోట్ల పాలకు ప్రయాణం : ఒకప్పుడు 247 లీటర్ల పాలతో ప్రారంభమైన అమూల్, నేడు ప్రతిరోజూ 2.63 కోట్ల లీటర్ల పాలను వ్యాపారం చేస్తుంది. మొత్తం 36.4 లక్షల మంది రైతులకి దీనితో అనుబంధం ఉంది. ఈ కంపెనీ ప్రతిరోజూ దాదాపు రూ.150 కోట్లు సంపాదిస్తోంది. తరువాత గ్రామాలకే పరిమితమైన సహకార సంఘం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభించింది. ప్రజలను మధ్యవర్తుల నుండి రక్షించడానికి అమూల్‌కు పునాది వేసిన త్రిభువన్ దాస్ పటేల్, దేశాన్ని పాల ఉత్పత్తిలో బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రజాదరణ పొందేలా చేశాడు. నేడు అమూల్ 50 కి పైగా దేశాలలో వ్యాపారం చేస్తోంది. దీనికి భారతదేశంలోనే 7000 కంటే ఎక్కువ ప్రత్యేక స్టోర్స్ ఉన్నాయి. శక్తివంతమైన బ్రాండింగ్ బలంతో, అమూల్ నేడు రూ. 80 వేల కోట్ల టర్నోవర్‌తో ఉంది.

నేడు అమూల్ (AMUL) గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) నిర్వహించే భారతీయ పాల ఉత్పత్తుల సహకార సంస్థ. ఈ పేరు భారతదేశంలో పాల ఉత్పత్తుల రంగంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ఇంకా అమూల్ దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల బ్రాండ్‌గా గుర్తింపు పొందింది.

అమూల్ పాల ఉత్పత్తులలో పాలు, వెన్న, నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్, చాక్లెట్లు అలాగే ఎన్నో ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. అమూల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. అమూల్ ఉత్పత్తులు నాణ్యత ఇంకా ధరల విషయంలో సామాన్యులకు చాల బడ్జెట్ ధరలో ఉన్నాయి. అమూల్ "ఆపరేషన్ ఫ్లడ్" అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ కార్యక్రమం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, రైతులకు మంచి ఆదాయం లభించేలా చేసింది. నేటికీ అమూల్ దేశంలోని లక్షలాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తోంది.

అమూల్ విజయంలో వర్గీస్ కురియన్ పాత్ర ఎన్నటికీ మరువలేనిది. ఎందుకంటే ఆయన నాయకత్వంలో అమూల్ రైతుల సహకారంతో పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, వారికి సరైన ధర లభించేలా చేసింది. ఆ కాలంలోనే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుండి పాలను సేకరించి, వాటిని నాణ్యమైన ఉత్పత్తులుగా మార్చి ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అమూల్ విజయగాథ భారతీయ సహకార ఉద్యమానికి ఒక స్ఫూర్తిదాయకం. ఇది రైతుల శక్తిని, సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అంతేకాదు అమూల్ దేశంలోని ఇతర సహకార సంస్థలకు ఆదర్శంగా నిలిచింది.

Take a Poll

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+