Amul Chittoor Dairy: దేశంలోనే అతిపెద్ద డెయిరీగా ఉన్న అమూల్ తాజాగా ఏపీలో భారీ పెట్టుబడిని ప్రకటించింది. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా ఈ పెట్టుబడులు వచ్చాయి.
రెండు దశాబ్దాల కిందట మూతపడిన దేశంలోనే ఇతిపెద్ద డెయిరీని తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. పాడి రైతుల కోసం డెయిరీని పునరుద్ధరించే క్రమంలో యాజమాన్య బాధ్యతలు అమూల్ కి అప్పగించారు. దీంతో అమూల్ ఈ ప్రాజెక్టులో రూ.385 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది.

డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులు చెల్లించి పునరుద్ధరణకు అమూల్ సంస్థతో ఒప్పందం కుదిరింది. పునరుద్ధరణ తర్వాత జున్ను, వెన్న, ఐస్క్రీమ్స్ మొదలైన పాల ఉత్పత్తులను కంపెనీ విక్రయించనుంది. సొంత డెయిరీ హెరిటేజ్ ప్రయోజనాల కోసం అప్పట్లో చిత్తూరు డెయిరీ మూతపడేలా చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. డెయిరీ క్రమంగా నష్టపోయేలా చూడాలని నాయుడు ప్రయత్నించారని ఆరోపించారు.
99 ఏళ్లకు లీజు ప్రాతిపథికన చిత్తూరుకు చెందిన విజయ డెయిరీని గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న అమూల్కు ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది. మెుదటి దశలో రూ.150 కోట్ల పెట్టుబడితో ఐస్క్రీం ప్లాంట్ ఏర్పాటు జరగనుంది. 10 నెలల్లో పాత ప్రాసెసింగ్ ప్రారంభం కానుందని సీఎం తెలిపారు. జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా అమూల్ డెయిరీ నిర్వహించడం వల్ల 5 వేల మందికి ఉపాధి లభించటంతో పాటు, లక్షలాది మంది పాడి రైతులకు సాధికారత చేకూరనుంది.
చిత్తూరు జిల్లాలో సహకార డెయిరీ చరిత్ర 1945 నుంచి పాల సేకరణ కేంద్రంగా స్థాపించబడింది. 1969లో డెయిరీ 6,000 లీటర్ల సేకరణతో సహకార కర్మాగారంగా మారింది. ఆ తర్వాత 1988లో విజయ డెయిరీ పేరుతో యూనిట్ తన వ్యాపారాన్ని 2.5 లక్షల లీటర్లకు విస్తరించింది. ఆ తర్వాత ప్రైవేట్ డెయిరీల ప్రవేశంతో 1990ల మధ్య భారీ నష్టాలకు గురై చివరికి మూతపడింది. అలా నాలుగు దశాబ్ధాల డెయిరీ ఘన చరిత్ర ముగిసి.. మళ్లీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరణకు నోచుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications