Who really buys Russian oil in India? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ భారత్ మీద బెదిరింపులకు దిగారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించుకోకపోతే 25 శాతం అదనపు సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే భారతీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి మన దేశంలో చమురును ఎవరు కొనుగోలు చేస్తున్నారు. ఏయే కంపెనీలకు అది వెళుతోంది అనే అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. భారతదేశం రష్యా చమురును ఎలా దిగుమతి చేస్తోంది ఈ కథనంలో ఓ సారి చూద్దాం.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడితో ప్రారంభమైన అంతర్జాతీయ ఉద్రిక్తతలు చమురు వర్తకాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అతి పెద్ద దిగుమతిదారైన భారత్ మీద దీని ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో 2022లో రష్యా నుంచి తీసుకునే చమురు వాటాను కేవలం 0.2% నుంచి 2025 నాటికి 35-40% వరకు పెంచింది. దీని వెనుక వ్యాపార నిర్ణయం మాత్రమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు, భద్రతా వ్యూహాలు, అంతర్జాతీయ దౌత్యం వంటి అంశాలు కలిసి ఉన్నాయి.
మన దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రష్యా నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారంగా ఉన్న జామ్నగర్ ఫెసిలిటీ ద్వారా రష్యన్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది జూలైలోనే 6.18 లక్షల బ్యారెళ్లు రోజుకు దిగుమతి చేసుకుంది. కంపెనీ మొత్తం దిగుమతుల్లో ఇది 57% కి పైగా ఉంది. రష్యా సంస్థ Rosneftతో దీర్ఘకాలిక ఒప్పందాలు కలిగిన RIL.. ప్రధానంగా యూరప్ మార్కెట్కి తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

ఇక Rosneft మద్దతుతో నడుస్తున్న మరో భారత దిగ్గజం నయారా ఎనర్జీ కూడా భారత్లో రెండవ అతిపెద్ద ప్రైవేట్ శుద్ధిదారుగా ఉంది. 2.4 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురును రోజూ అవసరాల కోసం వాడుతోంది. అయితే 2025 జూలై నెలలో యూరోపియన్ యూనియన్ ఆంక్షలతో నయారాకు నిర్వహణ సమస్యలు తలెత్తాయి. CEO రాజీనామా చేయడం..ఒత్తిడి భరించలేకపోవడమే దీనికి ఉదాహరణగా నిపుణులు చెబుతున్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు తొలుత రష్యన్ చమురును స్వీకరించినా, ఇటీవల US ఒత్తిడి కారణంగా తమ కొనుగోళ్లను తగ్గించాయి. IOC ఏకంగా రష్యా కొనుగోళ్లను పాజ్ చేసి, యుఎస్, కెనడా, యుఏఈల నుండి కొత్త డీల్స్కి మొగ్గుచూపింది.
రష్యన్ చమురుపై 2022లో లభించిన 15-20 డాలర్ల బ్యారెల్ తగ్గింపు కారణంగా భారత శుద్ధి కర్మాగారాలు మొత్తం 35 బిలియన్ డాలర్లను ఆదా చేశాయి. అయితే 2025 నాటికి ఈ తగ్గింపు కేవలం 2 బిలియన్ డాలర్లకు పరిమితం కావడంతో.. చాలా సంస్థలు తమ వ్యూహాలను పునః సమీక్షించాల్సి వచ్చింది.

రష్యను చమురును కొనుగోలు చేస్తున్న భారత కంపెనీల వివరాలు
ట్రంప్ నాయకత్వంలో అమెరికా భారత వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న హెచ్చరికలు భారత్ ను మళ్లీ ఆలోచనలో పడేశాయి. రష్యా చమురు ఎగుమతులపై యూరోప్ నిషేధాలు, చెల్లింపు విధానాలపై నియంత్రణలన్నీ కలిపి భారత కంపెనీలకు భారీ సవాళ్లుగా మారాయి.
ప్రస్తుతం రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ సరఫరాలపై కొనసాగుతున్నాయి. అయితే ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో కొత్త వనరుల వైపు దృష్టి సారించాయి. మధ్యప్రాచ్యం, యుఎస్, పశ్చిమ ఆఫ్రికా వంటి మార్కెట్లతో ఒప్పందాల కోసం రెడీ అవుతున్నాయి. ఇంధన భద్రత, వ్యాపార ప్రామాణికత, అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య సమతుల్యం సృష్టించడం.. భారత ప్రభుత్వానికి ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మారింది. వచ్చే ఏడాది నుండి అమలులోకి వచ్చే EU నిషేధాలు, US పాలసీ మార్పులు ఇందులో కీలక పాత్ర పోషించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

టారిఫ్లపై ట్రంప్కు బిగ్ షాకిచ్చిన మన్హట్టన్ కోర్టు.. రూ. 12 లక్షల కోట్లు వడ్డీతో సహా రీఫండ్ చేయాలని ఆదేశాలు

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications