Onion Price: కేజీ ఉల్లి ధర కేవలం రూ.35, ఎగబడి కొంటున్న ప్రజలు, ఎక్కడంటే..??

Telangana News: దేశవ్యాప్తంగా ఉల్లి సాగు చేసే కొన్ని రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలతో పంట నీట మునిగింది. పంట నష్టం ప్రత్యక్ష ప్రభావం ప్రస్తుతం సామాన్య వినియోగదారులపై పడింది. దీంతో దేశవ్యాప్తంగా ఉల్లి చిల్లర విక్రయ ధర కేజీకి రూ.70 నుంచి రూ.80 మధ్య కొనసాగుతున్నాయి. మండీల్లో సైతం ఉల్లి ధర రూ.60కి పైనే కొనసాగుతుండటంతో వినియోగదారులకు కష్టాలు తప్పటం లేదు.

ఈ క్రమంలో ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలను తగ్గించేందుకు మార్కెట్లో లభ్యతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని నాఫెడ్ ద్వారా నేరుగా వినియోగదారులకు తక్కువ ధరలకు అందించాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాఫెడ్ ఉల్లిని ఆటోల ద్వారా కేజీని ప్రభుత్వం నిర్థేశించిన ధర కేజీకి రూ.35 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. హోల్ సేల్ మార్కెట్లకు సైతం ఉల్లి రాక తగ్గిపోయిందని బ్రోకర్లు చెబుతున్నారు. రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన మథానియా నుండి ఉల్లి రాక తగ్గటంతో నాశిక్ నుంచి వచ్చే ఉల్లిపై ఆధారపడినట్లు ఉల్లిపాయ బ్రోకర్ల సంఘం అధ్యక్షుడు మదన్ శర్మ వెల్లడించారు.

Amid Onion Shortage center released buffer stock selling with nafed 35 rupees per Kg

దీంతో హైదరాబాదు మహా నగరంలో ఉల్లి వినియోగదారులకు పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించటంతో పాటు ధరల భారం నుంచి రక్షించేందుకు రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద నాఫెడ్ ఉల్లి వ్యాన్లను ప్రజలకు అందుబాటులో ఉంచిందని తెలంగాణ, ఏపీ నాఫేడ్ హెడ్ జ్యోతి పాటిల్ అన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు లేకుండా ఉల్లిని కేజీ ప్యాకెట్లు సిద్ధం చేసి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో వినియోగదారుడికి 3 కేజీల చొప్పున అందిస్తోంది. నాఫెడ్ వ్యాన్లు కొనుగోలుకు వచ్చిన వినియోగదారుల నుంచి ఫోన్ నంబర్, వారి పేరు వంటి బేసిక్ వివరాలను తీసుకుని ఉల్లిని అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ భరత్ నగర్ వద్ద నాఫెడ్ ఆధ్వర్యంలో రూ.35 లకే కిలో ఉల్లి విక్రయిస్తున్నారు. సబ్సిడీలో అందిస్తున్న ఉల్లిని కొనుగోలు చేసేందుకు జనం మెుబైల్ వ్యాన్ల దగ్గర బారులు తీరుతున్నారు.

వన్ ఇండియా తెలుగు టీమ్ నాఫెడ్ అందిస్తున్న మెుబైల్ వ్యాన్లకు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జ్యోతి పాటిల్ ఉల్లి విక్రయాలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఏపీలో మంగళవారం ఉల్లి విక్రయ ధరలను వివిధ ప్రాంతాల్లో పరిశీలిస్తే.. విజయవాడ రైతు బజార్లలో కిలో రూ.55, కర్నూలులో కిలో రూ.42, తాడేపల్లిగూడెం మార్కెట్లో కిలో రూ.52 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వర్షాల కారణంగా ఇతర కూరగాయల ధరలు సైతం ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బంగాళదుంపలు, కందిపప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి వంటి ఇతర వస్తువుల రేట్లు సైతం పెరగటం ప్రారంభించాయి. మరో పక్క గతవారంలో సుంకం పెంపుతో భారీగా పెరిగిన నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+