Hindenburg Saga: హిండెన్బర్గ్ రీసెర్చ్ సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్, ఆయన భర్తపై చేసిన ఆరోపణలు పెద్ద ప్రకంపనలు సృష్టించటం ప్రారంభించాయి. ఈ వ్యవహారంపై సంబంధిత వర్గాలు వరుసగా తమ ప్రతిస్పందనను ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆగస్టు 10న విడుదల చేసిన నివేదికపై అమెరికాకు చెందిన బ్లాక్స్టోన్ సంస్థ స్పందించింది. భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్ భర్త ధవల్ బుచ్ 2009 నుంచి బ్లాక్స్టోన్ ప్రైవేట్ ఈక్విటీకి సీనియర్ అడ్వైజర్గా ఉన్నట్లు బ్లాక్స్టోన్ వెల్లడించింది. అయితే ఆయనకు భారతీయ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (REITలు) లేదా క్యాపిటల్ మార్కెట్లలో ఎటువంటి ప్రమేయం లేదని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వర్గాలు తెలిపాయి. బ్లాక్స్టోన్లో ధవల్ ఆసియా అంతటా ఉన్న ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలకు ప్రొక్యూర్మెంట్, సప్లై చైన్ అంశాలపై సలహా ఇవ్వడానికి పరిమితం చేయబడినట్లు వెల్లడించింది.
ఆయనను అనేక ఇంటర్వ్యూల తర్వాత విస్తృతమైన నైపుణ్యాన్ని కలిగిన విభాగాల్లో ఉంచినట్లు పేర్కొంది. అలాగే యూనిలీవర్లో మాజీ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా అతని అనుభవం ఆధారంగా జరిగినట్లు పేర్కొంది. రాబోయే రోజుల్లో బ్లాక్స్టోన్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ధవల్ బుచ్ ప్రస్తుతం బ్లాక్స్టోన్ తో పాటు అల్వారెజ్ & మార్సల్ అనే గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థలో సీనియర్ సలహాదారుగా ఉన్నారు. అలాగే దుస్తులు రిటైలర్ అయిన బోర్డ్ ఆఫ్ గిల్డాన్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ధవల్ పై హిండెన్బర్గ్ ఆరోపణలు..
హిండెన్బర్గ్ ధవల్ బుచ్ ప్రస్తుత నికర విలువ $10 మిలియన్లుగా అంచనా వేసింది. బ్లాక్స్టోన్కు సలహాదారుగా ధవల్ బుచ్ ఉన్న సమయంలో రెగ్యులేటర్ సెబీ ప్రధాన REIT నిబంధనల మార్పులను ప్రతిపాదించి, వాటిని ఆమోదించిందని ఆరోపించింది. వాటిలోని నిబంధనలను సులభతరం చేసిందని హిండెన్బర్గ్ తన నివేదికలో పేర్కొంది. అలాగే మాధబీ బుచ్ మార్చి 2022లో చైర్పర్సన్ అయినప్పటి నుంచి ఆమె భర్త పనిచేస్తున్న భారతదేశంలోని అతిపెద్ద REIT స్పాన్సర్లలో ఒకరిగా బ్లాక్స్టోన్కు గణనీయమైన ప్రయోజనం చేకూర్చే REIT చట్టాన్ని సెబీ ప్రతిపాదించిందనే సంచలన ఆరోపణలు చేసింది.
REIT అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయ్?
పబ్లిక్గా-ట్రేడెడ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు నేషనల్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్లో నమోదు చేయబడి సెబీ చేత నియంత్రించబడతాయి. ఐదేళ్ల పాటు రంగం కోసం కొత్తగా ఏర్పడిన అంబ్రెల్లా బాడీ బాండ్లను జారీ చేయవచ్చు లేదా బ్యాంకుయేతర రుణదాతలు లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి రుణం తీసుకోవచ్చు. అయితే ఇవి నేరుగా బ్యాంకుల నుంచి రుణాలను పొందటానికి వీలు ఉండదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications