Hyderabad News: గడచిన రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రధాన నగరాలు జలమయం అయ్యాయి. రోడ్లు సైతం నీటితో మునిగిపోవటంతో ప్రజా జీవితం అస్థవ్యవస్థం అయ్యింది.
ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్ నగరం రెండు రోజులుగా ఎడతెరపిలేని కుండపోత వర్షాలను చూస్తోంది. ఇది ప్రజా రవాణా వ్యవస్థను సైతం దెబ్బతీసింది. ఈ తరుణంలో అధికారులు సైతం ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ చర్య రోడ్లపై అనవసరపు ట్రాఫిక్ ను నివారిస్తుందని వారు చెబుతున్నారు. అలాగే సహాయక చర్యలు వేగంగా నిర్వహించటానికి సైతం పౌరులు తమకు సహకరించాలని వారు సూచిస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలోని అధికార యంత్రాంగం విద్యా సంస్థలకు వర్షాల కారణంగా సెలవులు ప్రకటించింది. అయితే అనేక ఐటీ కంపెనీలు మాత్రం ఇప్పటికీ తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆదేశాలను కొనసాగిస్తున్నాయి. ఈ తరణంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అందించాలని తద్వారా వారు ఇళ్ల నుంచే పనిచేయగలుగుతారని లేఖ రాశారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయోల్ డేవిస్ దీనిపై టెక్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. అయితే వర్షాలతో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ వర్క్ఫ్రమ్ హోమ్ కొనసాగించవచ్చని తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఏపీలోని విజయవాడను వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణా నది సైతం ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నగరంలోని బస్ స్టాండ్, లోతట్టు ప్రాంతాలు, కరకట్ట సహా మరిన్ని ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులను సీఎం చంద్రబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఆహారం, పాలు, కనీస అవసరాలు అందించేందుకు హెలికాఫ్టర్లు సైతం రంగంలోకి దింపారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీగా విజయవాడకు చేరుకుంటున్నాయి. కొన్ని గంటల సమయంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయని ప్రజలు సహకరించాలని మీడియా ముఖంగా సీఎం చంద్రబాబు సూచించారు. ఈ తరుణంలో రాజధాని ప్రాంతం సైతం నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications