Hyderabad News: గడచిన రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రధాన నగరాలు జలమయం అయ్యాయి. రోడ్లు సైతం నీటితో మునిగిపోవటంతో ప్రజా జీవితం అస్థవ్యవస్థం అయ్యింది.
ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్ నగరం రెండు రోజులుగా ఎడతెరపిలేని కుండపోత వర్షాలను చూస్తోంది. ఇది ప్రజా రవాణా వ్యవస్థను సైతం దెబ్బతీసింది. ఈ తరుణంలో అధికారులు సైతం ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ చర్య రోడ్లపై అనవసరపు ట్రాఫిక్ ను నివారిస్తుందని వారు చెబుతున్నారు. అలాగే సహాయక చర్యలు వేగంగా నిర్వహించటానికి సైతం పౌరులు తమకు సహకరించాలని వారు సూచిస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలోని అధికార యంత్రాంగం విద్యా సంస్థలకు వర్షాల కారణంగా సెలవులు ప్రకటించింది. అయితే అనేక ఐటీ కంపెనీలు మాత్రం ఇప్పటికీ తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆదేశాలను కొనసాగిస్తున్నాయి. ఈ తరణంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అందించాలని తద్వారా వారు ఇళ్ల నుంచే పనిచేయగలుగుతారని లేఖ రాశారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయోల్ డేవిస్ దీనిపై టెక్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. అయితే వర్షాలతో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ వర్క్ఫ్రమ్ హోమ్ కొనసాగించవచ్చని తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఏపీలోని విజయవాడను వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణా నది సైతం ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నగరంలోని బస్ స్టాండ్, లోతట్టు ప్రాంతాలు, కరకట్ట సహా మరిన్ని ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులను సీఎం చంద్రబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఆహారం, పాలు, కనీస అవసరాలు అందించేందుకు హెలికాఫ్టర్లు సైతం రంగంలోకి దింపారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీగా విజయవాడకు చేరుకుంటున్నాయి. కొన్ని గంటల సమయంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయని ప్రజలు సహకరించాలని మీడియా ముఖంగా సీఎం చంద్రబాబు సూచించారు. ఈ తరుణంలో రాజధాని ప్రాంతం సైతం నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications