Kotak Mahindra Bank: స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం హిండెన్బర్గ్ రీసెర్చ్ కొత్త చర్చకు తెరలేపింది. గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల ట్రేడింగ్ పై పలు ఆరోపణలు చేసిన తర్వాత తాజాగా మార్కెట్లలో మరో తుఫాను చెలరేగింది.
తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ అదానీ కంపెనీలపై రిపోర్టుతో భారతీయ నిబంధనలు హిండెన్బర్గ్ ఉల్లంఘించిందంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమెరికా షార్ట్ సెల్లర్ మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రైవేట్ బ్యాంక్, ఇతర భారతీయ వ్యాపారవేత్తలను రక్షించడానికి ప్రయత్నిస్తోందంటూ ఎదురు దాడికి దిగింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ చిక్కుకోవటంతో ఇంట్రాడేలో 2 శాతం మేర నేడు నష్టపోయాయి.

అదానీ స్టాక్లను తగ్గించడంలో కోటక్ బ్యాంక్ అనుబంధ ఫండ్ ప్రమేయాన్ని వెల్లడించడంలో సెబీ సెబీ వెల్లడించటం లేదని గోప్యతను పాటిస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ స్పందిస్తూ.. కోటక్ మహీంద్రా బ్యాంక్ యూనిట్ అయిన కోటక్ మహీంద్రా (ఇంటర్నేషనల్) లిమిటెడ్, హిండెన్బర్గ్ రీసెర్చ్ తన కె-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ లిమిటెడ్లో ఎప్పుడూ క్లయింట్ లేదా పెట్టుబడిదారుగా ఉండలేదని పేర్కొంది. అయితే అదానీకి చెందిన షేర్లను కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కోసం షార్ట్ చేసినట్లు వెల్లడించింది.
తాజాగా హిండెన్బర్గ్ తమ పేరును బహిర్గతం చేయటంతో తాము బస్సు కింద పడ్డట్లుగా మారిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఫండ్ మేనేజర్ షేర్లు ఈక్విటీ ధర కంటే 200 రెట్లు అధిక రేటు వద్ద ఉన్నప్పుడు విక్రయించాలని నిర్ణయించినట్లయితే దానిని తాము మ్యానిపులేషన్ ట్రేడ్ అని ఎలా గుర్తించగలని ఆయన పేర్కొన్నారు. హిండెన్బర్గ్ తన ఇన్వెస్టర్లలో భాగస్వామిగా ఉన్నట్లు తమకు తెలియదని అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications