India-America deal: అమెరికాతో ఇండియా భారీ ఆటోమోటివ్ డీల్.. నగరాలకు భారీ బెనిఫిట్

India-America deal: సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం నుంచి ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత వెహికల్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికాతో ఓ భారీ ఒప్పందం చేసుకుంది. ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇదో పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

మేడ్-ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సులు.. భారతీయ రోడ్లపై త్వరలోనే విరివిగా చక్కర్లు కొట్టనున్నాయి. ఆటోమోటివ్ పరిశ్రమకు ఊతమివ్వడంలో భాగంగా తమతో కలిసి 10 వేల ఇ-బస్సులను తయారుచేయనున్నట్లు US ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు కర్బన ఉద్గారాలు, పలు రకాల కాలుష్యాలకూ చెక్ పెట్టవచ్చని పేర్కొంది.

America to support for producing 10k made in India electric buses

గతనెలలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఎలక్ట్రిక్ బస్సుల గురించి చర్చ జరిగింది. 'PM-eBus' పేరిట పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(PPP) విధానంలో 10 వేల ఇ-బస్సులను సిటీల్లో తిప్పేందుకు నిర్ణయించారు. ఈ పథకం వ్యయం 57 వేల 613 కోట్లు కాగా.. అందులో 20 వేల కోట్లను కేంద్రం అందించనుంది. 10 ఏళ్లపాటు ఈ సర్వీసులకు మద్ధతు ఇవ్వడానికి సైతం మోదీ సర్కారు అంగీకరించింది.

3 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాల్లోని రాజధాని నగరాలను ఈ పథకం కవర్ చేస్తుంది. ఇందులో వ్యవస్థీకృత బస్సు సేవలు లేని నగరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక దీనిద్వారా సుమారు 55 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+